తెలంగాణ

telangana

By

Published : Mar 4, 2020, 9:58 PM IST

Updated : Mar 5, 2020, 8:06 AM IST

ETV Bharat / sports

ఆసియా ఒలింపిక్​ క్వాలిఫైయర్స్​ క్వార్టర్స్​కు సాక్షి

భారత్ బాక్సర్​ సాక్షి చౌదరి.. ఆసియా ఒలింపిక్​ క్వాలిఫైయర్స్​​లో క్వార్టర్స్​కు చేరింది. 57 కిలోల విభాగంలో థాయ్​లాండ్​కు చెందిన నిల్వాన్​ టెకాసిప్​పై విజయం సాధించింది.

sakshi-chaudhary-advances-to-quarters-of-boxings-asian-olympic-qualifiers
ఆసియా ఒలింపిక్​ క్వాలిఫైయర్స్​లో క్వార్టర్స్​కు సాక్షి

భారత బాక్సర్​, ప్రపంచ మాజీ జూనియర్​ చాంపియన్​ సాక్షి చౌదరి.. ఆసియా ఒలింపిక్​​ క్వాలిఫైయర్స్​లో సత్తా చాటింది. 57 కిలోల విభాగంలో క్వార్టర్స్​కు చేరుకుంది. థాయ్​లాండ్​కు చెందిన నిలావన్​ టెకాసిప్​పై గెలుపొంది, ఒలింపిక్స్​ అర్హత పోటీల్లో ముందడుగేసింది.

రెండుసార్లు జూనియర్​ ప్రపంచ ఛాంపియన్​ అయిన సాక్షి.. ఈనెల 9న, కొరియా క్రీడాకారిణి ఇమ్​ ఎయిజీతో క్వార్టర్స్​లో తలపడనుంది. సాక్షి సెమీస్ చేరితే, ఈ ఏడాది జులై-ఆగస్టులో జరిగే టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధిస్తుంది.

ఇదీ చూడండి : అలాంటి ప్లేయర్​ ప్రతి జట్టుకు కావాలి: హర్మన్​

Last Updated : Mar 5, 2020, 8:06 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details