తెలంగాణ

telangana

By

Published : Oct 22, 2020, 8:56 AM IST

ETV Bharat / sports

నవంబరు 1 నుంచి సాయ్​ కేంద్రాల్లో శిక్షణ షురూ

ప్రాణాంతక కరోనా మహమ్మారి కారణంగా మూతపడిన భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్​) కేంద్రాలు మళ్లీ తెరుచుకోనున్నాయి. టోక్యో ఒలింపిక్స్​ను దృష్టిలో ఉంచుకుని సాయ్ కేంద్రాలను నవంబరు 1 నుంచి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సాయ్​ తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది.

SAI to resume training for athletes from 1st November ahead of Tokyo Olympics in 2021
నవంబరు 1 నుంచి సాయ్​ కేంద్రాల్లో శిక్షణ షురూ

కరోనా మహమ్మారి కారణంగా మూతపడిన భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్​) శిక్షణా కేంద్రాలు మళ్లీ తెరుచుకున్నాయి. నవంబరు ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న సాయ్​ శిక్షణా కేంద్రాలు క్రీడాకారులకు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్​ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సాయ్ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది.

"టోక్యో ఒలింపిక్స్​, పారాలింపిక్స్​ను దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా ఉన్న సాయ్​ కేంద్రాల్లో నవంబరు 1 నుంచి శిక్షణ ప్రారంభించాలని నిర్ణయించాం. కరోనా మహమ్మారి నుంచి క్రీడాకారులను సురక్షితంగా ఉంచే ప్రక్రియలో భాగంగా వారికి ప్రయాణ వసతి కల్పించనున్నాం. 500 కి.మీ. కంటే తక్కువ దూరంలో ఉన్నవాళ్లకు రైలు (థర్డ్​ ఏసీ) వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తాం" అని సాయ్ పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details