తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ అథ్లెట్ల​ కోసం రూ.5.78కోట్ల నిధులు విడుదల

దేశంలో ఉన్న 2,783 మంది ఖేలో భారత్​ అథ్లెట్ల​ ఖర్చుల కోసం రూ.5.78కోట్ల నిధులను విడుదల చేసింది సాయ్​. క్రీడాకారుల శిక్షణ, ఆహారం, ప్రయాణం, వసతుల సహా ఇతర ఖర్చుల కోసం ఈ స్కాలర్​షిప్​ను మంజూరు చేసింది.

By

Published : Nov 13, 2020, 9:04 AM IST

rizizu
రిజిజు

దేశవ్యాప్తంగా ఉన్న ఖేలో భారత్​ అథ్లెట్ల​ శిక్షణ, ఆహారం సహ ఇతర ఖర్చుల కోసం నిధులను విడుదల చేసింది సాయ్​. 2,783మంది క్రీడాకారులకు అక్టోబర్​, నవంబరు నెలలకు గానూ రూ.5.78కోట్లను కేటాయించింది. దీని ద్వారా ఈ రెండు నెలలకు ప్రతి అథ్లెట్​కు రూ.20,786 అందాయి. వీటిని ఆటగాళ్ల శిక్షణ, ప్రయాణాలు, ఆహారం, విద్య, వసతుల కోసం మంజూరు చేసింది.

అథ్లెట్స్​

అథ్లెట్స్​కు రోజువారి ఖర్చుల కోసం ఏటా రూ.1.20లక్షల రూపాయలను స్కాలర్​షిప్​గా ఇస్తోంది సాయ్. ఈ డబ్బులు నేరుగా వారి బ్యాంక్​ ఖాతాల్లోకి జమ అవుతాయి. అందులో భాగంగానే ఈ నిధులను విడుదల చేసింది​.

ఇదీ చూడండి : సాయ్​లో బాక్సర్లకు శిక్షణ పునఃప్రారంభం

ABOUT THE AUTHOR

...view details