తెలంగాణ

telangana

By

Published : Feb 25, 2022, 10:16 PM IST

ETV Bharat / sports

PKL 2022: ప్రొ కబడ్డీ విజేతగా దబంగ్ దిల్లీ

PKL winner: బెంగళూరు వేదికగా జరిగిన ప్రొ కబడ్డీ ఫైనల్​లో దిల్లీ జట్టు విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో తొలిసారి టైటిల్​ను ముద్దాడింది.

Pro Kabaddi 2022 Dabang Delhi
పీకేఎల్ విన్నర్ దబంగ్ దిల్లీ

ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) ఎనిమిదో సీజన్​ విజేతగా దబంగ్ దిల్లీ అవతరించింది. పట్నా పైరేట్స్‌, దబంగ్‌ దిల్లీ జట్ల మధ్య జరిగిన తుది పోరులో గెలిచిన దిల్లీ.. తొలిసారి ఛాంపియన్‌గా ఆవిర్భవించింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్​లో 37-36 తేడాతో దిల్లీ జట్టు గెలుపొందింది. దీంతో మూడుసార్లు టైటిల్‌ విజేత పట్నా పైరేట్స్ ఒక పాయింట్ తేడాతో ఓటమి పాలైంది.

దిల్లీ జట్టులో విజయ్‌ 14, నవీన్‌ కుమార్‌ 13 పాయింట్లు సాధించగా.. సందీప్‌ నర్వాల్‌, మంజీత్ చిల్లర్ చెరో రెండు పాయింట్లు రాబట్టారు. పట్నా జట్టులో సచిన్‌ 10, గుమన్‌ సింగ్‌ 9, మహమ్మద్‌ రెజా 5, ప్రశాంత్‌ కుమార్‌ రెండు, నీరజ్ కుమార్‌, సజిన్ తలో ఒక పాయింట్ సాధించారు.

పీకేఎల్-2022 పీకేఎల్ విన్నర్

ABOUT THE AUTHOR

...view details