రెజ్లర్ సుశీల్ కుమార్ (sushil kumar wrestler)పై దిల్లీ పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. తుది నివేదిక ప్రకారం అతడిని ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. ఈ రిపోర్టును చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సత్వీర్ సింగ్ లంబాకు అందించారు.
రెజ్లర్ సుశీల్పై దిల్లీ పోలీసుల ఛార్జిషీట్ - sushil kumar wrestler
మల్లయోధుడు సాగర్ రానా హత్య కేసు ప్రధాన నిందితుడు రెజ్లర్ సుశీల్ కుమార్ (sushil kumar wrestler)తో పాటు మరో 19మందిపై దిల్లీ పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఇందులో సుశీల్ను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు.
![రెజ్లర్ సుశీల్పై దిల్లీ పోలీసుల ఛార్జిషీట్ Wrestler Sushil Kumar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12649011-thumbnail-3x2-sk.jpg)
రెజ్లర్ సుశీల్ కుమార్
మే 4న దిల్లీలోని ఛత్రశాల్ స్టేడియం వద్ద మల్లయోధుడు సాగర్ రానాను సుశీల్తో పాటు అతని సన్నిహితులు హత్య చేశారు. ఈ దాడిలో సాగర్ అక్కడిక్కడే మృతి చెందగా, అతడి మిత్రులు సోను, అమిత్ కుమార్ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఇందులో 15 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేయగా.. మిగిలిన వారిని పట్టుకునే పనిలో ఉన్నారు.
ఇదీ చదవండి:స్టార్ ఆటగాళ్లను భయపెడుతున్న ఆ 'ఒక్కటి'!