ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. భారత్కు చెందిన ఐదుగురు చెస్ క్రీడాకారులపై ప్రశంసలు కురిపించారు. వినూత్న పద్ధతిలో పీఎం కేర్స్కు వారు విరాళాలు సేకరించడంపై హర్షం వ్యక్తం చేశారు.
"మన చెస్ ప్లేయర్లు విశ్వనాథన్ ఆనంద్, విదిత్, హరికృష్ణ, అబిదన్, ద్రోణవల్లి హారికల వినూత్న ఆలోచన బాగుంది. వారితో ఆన్లైన్ పోటీల్లో పాల్గొన్న వ్యక్తులు అద్భుతమైన అనుభవాన్ని పొందుంటారు" -ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్