తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఒలింపిక్స్​కు ముందు అథ్లెట్లతో మోదీ సమావేశం! - Indian contingent

టోక్యో ఒలింపిక్స్​(Tokyo Olympics)లో పాల్గొనే క్రీడాకారులను అధికారికంగా పంపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(modi) యోచిస్తున్నట్లు తెలుస్తోంది. క్రీడాకారుల ప్రయాణానికి ముందు మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యి.. వారితో మాట్లాడతారని సంబంధిత అధికారులు ఏఎన్​ఐ వార్తాసంస్థకు వెల్లడించారు.

PM Modi expected to give official send-off to Indian contingent
ఒలింపిక్స్​కు ముందు అథ్లెట్లతో మోదీ సమావేశం!

By

Published : Jun 13, 2021, 10:12 AM IST

Updated : Jun 13, 2021, 11:49 AM IST

ఒలింపిక్స్​(Olympics)లో పాల్గొనబోయే అథ్లెట్ల బృందానికి అధికారికంగా పంపాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి మోదీ వారితో మాట్లాడుతారని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి. ఆ కార్యక్రమం జరిగిన తర్వాత భారత బృందం ఎప్పుడైనా టోక్యో బయలుదేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

"ఒలింపిక్స్​కు వెళ్లే అథ్లెట్లతో ప్రధానమంత్రి మోదీ మాట్లాడి.. అధికారికంగా టోక్యో పంపించే అవకాశం ఉంది. కానీ, అది ఏ రోజు అనేది ఇంకా స్పష్టత రాలేదు. జులై 10-15 మధ్య జరిగే కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత క్రీడాకారులు ఎప్పుడైనా బయల్దేరవచ్చు. విదేశాల్లో వివిధ టోర్నీల్లో పాల్గొంటున్న ఆటగాళ్లు సరాసరి టోక్యోకు చేరుకుంటారు" అని సంబంధిత అధికారులు ఏఎన్​ఐ వార్తాసంస్థకు వెల్లడించారు.

టోక్యో ఒలింపిక్స్​ వచ్చే నెల 23 నుంచి సెప్టెంబరు 5 వరకు జరగనున్నాయి. ఒలింపిక్స్​లో మొత్తంగా 11 క్రీడా విభాగాల్లో దాదాపుగా 100 మంది భారత అథ్లెట్లు పాల్గొననున్నారు. దీంతో పాటు మరో 25 మంది క్రీడాకారులు అర్హత పొందే అవకాశం ఉంది. దేశం తరఫున ఎంతమంది పాల్గొంటారనే విషయంపై ఈ నెలాఖరున స్పష్టత రానుంది.

ఇదీ చూడండి..అక్కడికి వెళ్లే అథ్లెట్ల కోసం 1.6 లక్షల కండోమ్​లు

Last Updated : Jun 13, 2021, 11:49 AM IST

ABOUT THE AUTHOR

...view details