తెలంగాణ

telangana

ETV Bharat / sports

Tokyo paralympics: అధానాకు కాంస్యం.. ప్రధాని, రాష్ట్రపతి ప్రశంసలు - Paralympics 2021

పారాలింపిక్స్(tokyo paralympics)​లో కాంస్యం గెలిచిన సింగ్​రాజ్ అధానా(singhraj adhana)పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ప్రధాని మోదీ, రాష్ట్రపతి కూడా ఇతడి విజయాన్ని కొనియాడారు.

Adana
అధానా

By

Published : Aug 31, 2021, 3:56 PM IST

పారాలింపిక్స్‌(tokyo paralympics)లో భారత్‌కు మరో పతకం దక్కింది. షూటింగ్‌లో సింఘరాజ్​ అధానా(singhraj adhana) కాంస్య పతకం గెలుచుకున్నాడు. ఈ నేపథ్యంలో అధానాను ప్రశంసలతో ముంచెత్తారు ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్.

"అద్భుత ప్రదర్శన చేశావు సింగ్​రాజ్ అధానా. ప్రతిభగల భారత షూటర్​ దేశానికి కాంస్యం తీసుకొచ్చాడు. ఈ విజయాన్ని అందుకునేందుకు అతడు చాలా శ్రమించాడు. భవిష్యత్​లో మరిన్ని పతకాలు గెలవాలని కోరుకుంటున్నా."

-ప్రధాని మోదీ

మోదీతో పాటు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌, క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు.

పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్‌ 1 విభాగంలో 216.8 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు అధానా. తద్వారా కాంస్యం దక్కించుకున్నాడు. భారత్ తరఫున పాల్గొన్న మరో షూటర్‌ మనీశ్‌ అగర్వాల్ ఫైనల్స్‌లో ఏడో స్థానంతో సరిపెట్టుకొన్నాడు. దీంతో పారాలింపిక్స్‌లో భారత్‌ సాధించిన పతకాల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. మంగళవారం జరిగిన ఫైనల్‌లో చైనా క్రీడాకారుడు డిఫెడింగ్ ఛాంపియన్‌ చావో యాంగ్‌ (237.9 ‌) పారాలింపిక్ రికార్డు సృష్టించి స్వర్ణం సాధించగా, మరో చైనా క్రీడాకారుడు హువాంగ్ జింగ్‌ (237.5) రజతం అందుకున్నాడు.

ఇవీ చూడండి: IPL 2022: కొత్త జట్ల కనీస ధర పెంపు.. బోర్డుకు కాసుల వర్షమే!

ABOUT THE AUTHOR

...view details