భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు నరీందర్ బత్రా ఇంట్లో మరో వ్యక్తికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో మొత్తం సంఖ్య ఎనిమిదికి చేరింది. ఈ విషయాన్ని ఆయనే ఓ ప్రకటనలో స్వయంగా వెల్లడించారు. ఇప్పటికే నెగిటివ్ వచ్చిన వారికి వచ్చే వారం మరోసారి వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు.
ఐఓఏ అధ్యక్షుడి ఇంట్లో ఎనిమిదో వ్యక్తికి కరోనా - నరీందర్ బత్రా ఇంట్లో మరొకరికి కరోనా
ఐఓఏ అధ్యక్షుడు నరీందర్ బత్రా ఇంట్లో ఎనిమిదో వ్యక్తి తాజాగా కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే ఆయన ఇంట్లోని మిగతా సభ్యులు, ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నారు.
![ఐఓఏ అధ్యక్షుడి ఇంట్లో ఎనిమిదో వ్యక్తికి కరోనా ఐఓఏ అధ్యక్షుడి ఇంట్లో 8 మందికి కరోనా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7582318-665-7582318-1591939192184.jpg)
భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు నరీందర్ బత్రా
నరీందర్ బత్రా ఇంటిలో తొలుత ఆయన తండ్రికి కరోనా సోకింది. ఆ తర్వాత ఇద్దరు సెక్యూరిటీ గార్డులు, అటెండర్ ఈ వైరస్ బారిన పడ్డారు. దీంతో మిగతా కుటుంబసభ్యులు జూన్ 26 వరకు హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారు.
ఇవీ చదవండి: