భారత్లో నేషనల్ బాస్కెట్బాల్ అసోషియేషన్ (ఎన్బీఏ) సందడి ముగిసింది. రెండు రోజుల పాటు బాస్కెట్బాల్ ప్రియుల్ని అలరించిన ఎగ్జిబిషన్ మ్యాచ్లకు తెరపడింది. తొలి రోజు ఉత్కంఠ పోరులో 132-131 తేడాతో శాక్రమెంటో కింగ్స్ను ఓడించిన ఇండియానా పేసర్స్.. రెండో మ్యాచ్లోనూ జయకేతనం ఎగరేసింది.
ముంబయిలో జరిగిన ఈ మ్యాచ్లో పేసర్స్ 130-106 తేడాతో కింగ్స్ను ఓడించింది. మ్యాచ్లో నాలుగు క్వార్టర్లలోనూ పేసర్స్ ఆధిపత్యమే సాగింది. అలిజ్ జాన్సన్ 17 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలిచాడు.