తెలంగాణ

telangana

By

Published : May 5, 2021, 8:58 PM IST

ETV Bharat / sports

ఒలింపిక్స్​ శిక్షణ కోసం పుణెకు​ మేరీకోమ్​

భారత మహిళల బాక్సింగ్​ శిక్షణ శిబిరాన్ని తాత్కాలికంగా పుణెకు తరలించారు. మేరీకోమ్​తో పాటు పది మంది బాక్సర్లు టోక్యో ఒలింపిక్స్​ కోసం ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నారు.

mary kom
మేరీకోమ్​

టోక్యో ఒలింపిక్స్​ కోసం సన్నద్ధమవుతున్న భారత మహిళా బాక్సర్ల శిక్షణ తిరిగి ప్రారంభమైంది. జాతీయ మహిళా బాక్సింగ్ శిక్షణ​ శిబిరంలో ఇటీవల కరోనా కేసులు నమోదవ్వడం వల్ల ఈ క్యాంప్​ను తాత్కాలికంగా పుణెలోని ఆర్మీ స్పోర్ట్స్​ ఇన్​స్టిట్యూట్​కు తరలించారు. జులై 31 వరకు ఇక్కడే ఈ శిబిరాన్ని కొనసాగించనున్నారు.

మేరీ కోమ్​తో(51 కిలోలు)పాటు సిమ్​రంజిత్​ కౌర్​(60), లవ్లీనా బోర్గోహైన్​(69), జమున బోరో(54), పూజారాణి(75), అరుంధతి చౌదరీ(69), మంజు రాణి(48), సోనియా లాథర్​(57), లాల్బువాసైహి(64), షాషి చోప్రా(57) ఇక్కడ శిక్షణ తీసుకోనున్నారు. ఈ బాక్సర్లను రెండు స్పారింగ్​ భాగస్వాములతో మూడు గ్రూపులుగా విభజించి అత్యంత భద్రత చర్యల మధ్య ట్రైనింగ్​ ఇవ్వనున్నారు.

ఇదీ చూడండి:బాక్సింగ్​ శిబిరంలో 21 మందికి పాజిటివ్​

ABOUT THE AUTHOR

...view details