తెలంగాణ

telangana

ETV Bharat / sports

షూటింగ్ ప్రపంచకప్​లో మను-సౌరభ్​కు పసిడి

బీజింగ్ ఐఎస్​​ఎస్​ఎఫ్​ ప్రపంచకప్​లో భారత షూటర్లు మనుబాకర్- సౌరభ్​ చౌదరి జోడి గోల్డ్ నెగ్గింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్​డ్​ టీమ్​ ఈవెంట్​లో చైనా ద్వయాన్ని ఓడించింది. ఈ టోర్నీలో భారత్​కిది రెండో స్వర్ణం.

By

Published : Apr 25, 2019, 5:23 PM IST

మనుబాకర్ -సౌరభ్​ చౌదరి

చైనా బీజింగ్​లో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్​ ఫెడరేషన్​ (ఐఎస్ఎస్ఎఫ్​) ప్రపంచకప్​లో భారత షూటర్లు సత్తా చాటుతున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్​ మిక్స్​డ్ టీమ్​ ఈవెంట్​లో మనుబాకర్-సౌరభ్​ చౌదరి జోడి స్వర్ణాన్ని నెగ్గింది. చైనాకు చెందిన జియాంగ్ - పాంగ్ వీ ద్వయంపై 16-6 తేడాతో గెలిచింది.

అర్హత పోటీలో 482 పాయింట్లే సాధించిన మనుబాకర్, సౌరబ్​... ఫైనల్స్​లో మాత్రం సత్తా చాటి పసిడి కైవసం చేసుకున్నారు. 483.5 పాయింట్ల వద్ద ముగించి అందరికంటే ముందు నిలిచారు. ఈ టోర్నీలో భారత్​కు ఇది రెండో స్వర్ణం. అంజుమ్- దివ్యాంశ్ జోడి ఈరోజు తొలి స్వర్ణాన్ని గెలిచింది.

ఈ ఏడాది ప్రారంభంలో న్యూదిల్లీ షూటింగ్ ప్రపంచకప్​లోనూ మనుబాకర్- సౌరభ్​ ద్వయం బంగారు పతకాన్ని గెలిచింది. ఈ టోర్నీలో పురషుల సింగిల్స్​ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలోనూ గోల్డ్ గెలిచాడు 16 ఏళ్ల సౌరభ్ చౌదరి.

ABOUT THE AUTHOR

...view details