తెలంగాణ

telangana

By

Published : Sep 30, 2019, 11:10 PM IST

Updated : Oct 2, 2019, 4:27 PM IST

ETV Bharat / sports

జావెలిన్​ త్రోలో జాతీయ రికార్డు బ్రేక్ చేసిన అన్నురాణి

ఖతార్ దోహా వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్​షిప్​లో భారత జావెలిన్ త్రో క్రీడాకారిణి అన్నురాణి జాతీయ రికార్డు నమోదు చేసింది. 62.43 మీటర్లు విసిరి తన రికార్డు తానే బద్దలు కొట్టింది.

అన్నురాణి

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్​షిప్​లో భారత క్రీడాకారిణి అన్ను రాణి జాతీయ రికార్డు నెలకొల్పింది. జావెలిన్ త్రోలో తనపేరిట ఉన్న రికార్డును తానే తిరగరాసింది. ఖతార్ దోహా వేదికగా జరిగిన క్వాలిఫైయింగ్​ రౌండ్​లో మూడో స్థానంలో నిలిచింది.

గ్రూప్​-ఏ నుంచి అర్హత పోటీల్లో పాల్గొన్న అన్ను రాణి తొలి రౌండ్​లో 57.05 మీటర్లు విసరగా.. రెండో రౌండ్​లో 62.43 మీటర్లు విసిరింది. చివరి రౌండ్​లో 60.50 మీటర్లతో మూడో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది పటియాలాలో జరిగిన ఫెడరేషన్​కప్​లో 62.34 మీటర్లతో జాతీయ రికార్డు నెలకొల్పింది.

అన్ను ప్రస్తుతం గ్రూప్​-బీ అర్హత పోటీలకోసం ఎదురుచూస్తోంది. రెండు గ్రూపుల్లో ఉత్తమ ప్రదర్శన చేసిన టాప్-12 మంది ఫైనల్ రౌండ్​లో పాల్గొంటారు. ఒకవేళ అన్ను తుదిపోరుకు అర్హత సాధిస్తే ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళా జావెలిన్ త్రోయర్​గా రికార్డుకెక్కుతుంది. మంగళవారం ఫైనల్​ పోటీలు జరగనున్నాయి.

ఇదీ చదవండి: సుమోలతో తలపడ్డ స్టార్ టెన్నిస్ ప్లేయర్

Last Updated : Oct 2, 2019, 4:27 PM IST

ABOUT THE AUTHOR

...view details