ఎన్ని అడ్డంకులు వచ్చినా టోక్యో ఒలింపిక్స్ మాత్రం ఆగవని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ స్పష్టం చేసింది. చివరికి జపాన్ మొత్తం ఎమర్జెన్సీ ప్రకటించినా, మెగా టోర్నీని నిర్వహించి తీరుతామని తేల్చిచెప్పింది.
ఒలింపిక్స్ ప్రారంభానికి సరిగ్గా ఇంకా రెండు నెలల సమయం ఉంది. ఓ వైపు జపాన్లోని దాదాపు 80% ప్రజలు ఈ ప్రతిష్ఠాత్మక క్రీడల నిర్వహణకు వ్యతిరేకత చూపుతున్నారు. క్రీడల నిర్వహణ వల్ల కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని స్థానిక వైద్య నిపుణులు వివరిస్తున్నారు. ఈ తరుణంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.