తెలంగాణ

telangana

ETV Bharat / sports

అథ్లెట్ అంబాసిడర్ గ్రూపులో మేరీకోమ్ - IOC names Mary Kom in boxing's athlete ambassadors group

భారత దిగ్గజ మహిళా బాక్సర్ మేరీ కోమ్​ను ప్రఖ్యాత అథ్లెట్ అంబాసిడర్స్ గ్రూపులో చేర్చింది ఐఓసీ. ఈ గ్రూపు నుంచి మేరీ ఆసియా ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించనుంది.

మేరీ కోమ్

By

Published : Oct 31, 2019, 6:27 PM IST

భారత మహిళా బాక్సర్ మేరీ కోమ్‌కు ఆరుదైన గౌరవం దక్కింది. 10 మందితో కూడిన ప్రఖ్యాత అథ్లెట్ అంబాసిడర్స్ గ్రూపులో మేరీకోమ్‌ను నియమిస్తూ ప్రపంచ ఒలంపిక్ కమిటీ (ఐఓసీ) నిర్ణయం తీసుకుంది. ఈ గ్రూపు నుంచి మేరీ కోమ్ ఆసియా ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించనుంది.

ప్రతి ప్రాంతానికి ఒక మహిళ, ఒక పురుష బాక్సర్‌ రాయబారిగా ప్రాతినిధ్యం వహించి.. ఆ ప్రాంతంలోని బాక్సింగ్ సమాజంతో కలిసి పనిచేస్తారు. అలాగే టోక్యో ఒలంపిక్స్ 2020 కోసం బాక్సింగ్ టాస్క్ ఫోర్స్ (బీటీఎఫ్) నిర్వహించే.. అర్హత పోటీల రూపకల్పనలో ఈ గ్రూపు సహాయ పడనున్నట్లు ఐఓసీ తెలిపింది.

బాక్సింగ్ అంబాసిడర్‌గా ఐఓసీ గుర్తించడం పట్ల మేరీకోమ్‌ సంతోషం వ్యక్తం చేసింది. ఇది గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొంటు.. తోటి అథ్లెట్లకు సాయం చేసేందుకు కృషి చేస్తానని తెలిపింది.

ఇవీ చూడండి.. మంచే సమస్య.. లేదంటే గులాబీదే విజయం

ABOUT THE AUTHOR

...view details