ఒలింపిక్స్(Tokyo Olympics) విజేతలకు అందించే ప్రతకాల ప్రదానోత్సవంలో పాటించాల్సిన కరోనా నిబంధనలపై మార్గదర్శకాలను విడుదల చేసింది ఐఓసీ. అథ్లెట్లు, మెడల్ ప్రెజెంటేటర్స్, వాలంటీర్స్ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆదేశించింది. గ్రూప్ ఫొటోలు దిగకూడడని స్పష్టం చేసింది. విజేతలు పతకాలు తీసుకునేటప్పుడు భౌతిక దూరం పాటించడానికి వీలుగా వేర్వేరు వేదికలు(పోడియాలు) ఏర్పాటు చేస్తామని వెల్లడించింది.
"ప్రెజెంటేటర్స్ అందరూ వ్యాక్సిన్ వేయించుకువాలి. ఒక్కో ఈవెంట్లో ఐఓసీ సభ్యుడు, అంతర్జాతీయ ఫెడరేషన్ తరఫున ఒక్కరే ఉండాలి. కరోనా నేపథ్యంలో ప్రతిఒక్కరి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ జాగ్రత్త చర్యలు తప్పనిసరిగా పాటించాలి."
-ఐఓసీ.
ఈ మెగాక్రీడల్లో సాధారణంగా గెలుపొందిన అథ్లెట్లకు మెడల్స్ను వారి మెడలో వేసి సత్కరిస్తారు. అయితే ఈసారి కరోనా కారణంగా పతకాలను ఓ ట్రేలో తీసుకురాగా, క్రీడాకారులు స్వయంగా తమ పతకాలను మెడలో వేసుకునేలా నిర్ణయం తీసుకున్నారు. కరచాలనం, ఆలింగనం వంటివి కూడా ఉండవని స్పష్టం చేశారు.
ఆరు నెలల గరిష్ఠానికి
ఒలింపిక్స్కు ఆతిథ్యమివ్వనున్న టోక్యో నగరంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గురువారం(జులై 15) కేసులు సంఖ్య ఆరు నెలల గరిష్ఠానికి చేరుకుంది. ఈ ఏడాది జనవరి 21న 1,485 కేసులు రాగా.. ఆ తర్వాత రికార్డు స్థాయిలో గురువారం 1,308 కొత్త కేసులు నమోదవ్వడం కలవరపెడుతోంది.
ఇదీ చూడండి: Olympics: త్వరలో ఒలింపిక్స్.. మరోవైపు భారీగా కేసులు