భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) వైస్ ప్రెసిడెంట్ జనార్ధన్ సింగ్ గెహ్లోట్ కన్నుమూశారు. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న 70 ఏళ్ల గెహ్లోట్.. రాజస్థాన్లోని జైపూర్లో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
"గెహ్లోట్ మృతికి భారత ఒలింపిక్ అసోసియేషన్ తరఫున, నా వ్యక్తిగతంగా సంతాపం తెలుపుతున్నా. ఆయన ఐఓఏ వైస్ ప్రెసిడెంట్గానే కాకుండా రాజస్థాన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగానూ పదవిలో ఉన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని.. ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను."
-నరేందర్ బాత్రా, భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు.