తెలంగాణ

telangana

ETV Bharat / sports

తొలిసారి ఆన్‌లైన్‌ వేదికన కరాటే చాంపియన్‌ షిప్‌ పోటీలు - Hyderabad Latest News

రాష్ట్రంలో అంతర్జాతీయ కరాటే చాంపియన్‌ షిప్‌ పోటీలు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో టోర్నమెంట్‌ బ్రోచర్‌తోపాటు మోడల్‌ ట్రోపీని ఆవిష్కరించారు. తొలిసారిగా ఆన్‌లైన్‌ ద్వారా ఈ పోటీలు జరుపుతున్నారు.

తొలిసారి ఆన్‌లైన్‌ వేదికన కరాటే చాంపియన్‌ షిప్‌ పోటీలు
తొలిసారి ఆన్‌లైన్‌ వేదికన కరాటే చాంపియన్‌ షిప్‌ పోటీలు

By

Published : Mar 17, 2021, 9:45 PM IST

మాస్టర్‌ కేశవ్‌ షాటోకన్‌ కరాటే అకాడమి ఆధ్వర్యంలో తెలంగాణలో అంతర్జాతీయ కరాటే చాంపియన్‌ షిప్‌ పోటీలు నిర్వహించనున్నారు. తొలిసారిగా ఆన్‌లైన్‌ ద్వారా జరుపుతున్న ఈ పోటీల్లో 21 దేశాలకు చెందిన దాదాపు 2 వేల మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు.

టోర్నమెంట్‌ బ్రోచర్‌తోపాటు మోడల్‌ ట్రోఫీని హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్రంలో మొదటిసారి ఆన్‌లైన్‌ ద్వారా పోటీలు నిర్వహించడం,2 వేలకు పైగా క్రీడాకారులు పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.

కార్యక్రమలో నాగిరెడ్డి, దళిత రత్న అవార్డు గ్రహీత మాణిక్​రావ్​, పోలిశెట్టి శ్రీనివాస్, కేశవ్ గౌడ్, కన్నం గౌడ్, మాస్టర్ విక్కీ, మల్లేష్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి:కమర్షియల్ వాహనాల ప్రదర్శనకు వేదిక కానున్న హైదరాబాద్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details