తెలంగాణ

telangana

కాంస్య పోరులో గెలిచిన రాహుల్​ అవారే

By

Published : Sep 22, 2019, 6:29 PM IST

Updated : Oct 1, 2019, 2:46 PM IST

ప్రపంచ రెజ్లింగ్​ ఛాంపియన్​షిప్​లో భారత్​ మరో పతకం సొంతం చేసుకుంది. కాంస్యం కోసం ఆదివారం జరిగిన పోరులో రాహుల్​ అవారే గెలిచాడు. 61 కేజీల విభాగంలో లీ గ్రాఫ్​(అమెరికా)ను ఓడించాడు. ఈ టోర్నీలో భారత్​.. స్వర్ణం లేకుండానే తన ప్రయాణాన్ని ముగించింది.

కాంస్యం పోరులో గెలిచిన రాహుల్​ అవారే

కజకిస్థాన్​ వేదికగా జరుగుతున్న ప్రపంచ రెజ్లింగ్​ ఛాంపియన్​షిప్​లో రాహుల్​ అవారే సత్తా చాటాడు. ఆదివారం.. కాంస్యం కోసం 61 కిలోల విభాగంలో బరిలోకి దిగిన ఈ స్టార్​ రెజ్లర్​... లీ గ్రాఫ్​(అమెరికా)ను ఓడించి పతకం అందుకున్నాడు.

ఈ టోర్నీలో భారత్​ మిగతా రెజ్లర్లు దీపక్​ పునియా (86 కిలోలు) వెండి పతకంతో సరిపెట్టుకున్నాడు. ఆదివారం జరగాల్సిన ఫైనల్​ నుంచి గాయం కారణంగా తప్పుకున్నాడు. ఆదివారంతో ముగిసిన ఈ టోర్నీలో ఒక వెండి, నాలుగు కాంస్యాలు సాధించారు భారత రెజ్లర్లు. దీపక్​ పునియా(వెండి), వినేశ్​ ఫొగాట్​, బజరంగ్​ పునియా, రవి దహియా, రాహుల్​ అవారే... కాంస్యాలతోనే సరిపెట్టుకున్నారు.

ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో బంగారు పతకం గెలిచిన ఆటగాడిగా సుశీల్​కుమార్​ (66 కిలోలు) మాత్రమే ఉన్నాడు. 2010 మాస్కోలో జరిగిన ప్రపంచ ఛాంపియన్​షిప్​లో ఈ ఘనత సాధించాడు సుశీల్​.

Last Updated : Oct 1, 2019, 2:46 PM IST

ABOUT THE AUTHOR

...view details