తెలంగాణ

telangana

టోర్నీలో ఓడినా.. ఒలింపిక్స్​కు అర్హత సాధించారు

By

Published : Sep 19, 2019, 6:29 PM IST

Updated : Oct 1, 2019, 5:51 AM IST

ప్రపంచ రెజ్లింగ్​ ఛాంపియన్​షిప్​ సెమీస్​లో ఓటమి పాలయ్యారు భారత రెజ్లర్లు భజరంగ్​ పునియా, రవి దహియా. అయినప్పటికీ టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించారు.

టోక్యో ఒలింపిక్స్​కు భజరంగ్​, రవి అర్హత

కజకిస్థాన్​ వేదికగా జరుగుతున్న ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ల స్వర్ణం ఆశలు అవిరయ్యాయి. గురువారం జరిగిన సెమీస్​లో భజరంగ్​ పునియా, రవి దహియా ఓడిపోయారు. అయినప్పటికీ ఒలింపిక్​ బెర్త్‌ను ఖరారు చేసుకున్నారు.

పురుషుల 65 కేజీల విభాగం సెమీస్​లో... కజికిస్థాన్​కు చెందిన దౌలత్ నియాజ్బెకోవ్​ చేతిలో 2-7 తేడాతో చిత్తుగా ఓడిపోయాడు భజరంగ్‌. పురుషుల 57 కేజీల విభాగంలో పోటీపడిన మరో భారత రెజ్లర్‌ రవి దహియా... ప్రపంచ ఛాంపియన్​ జౌర్ ఉగ్వేవ్​ చేతిలో 4-6 తేడాతో ఓటమి పాలయ్యాడు. అయితే అంతకు ముందు క్వార్టర్స్​లో నెగ్గిన వీరిద్దరూ.. ఒలింపిక్స్​కు అర్హత సాధించారు. కాంస్యం కోసం శుక్రవారం జరిగే పోరులో ఈ ఇద్దరు రెజ్లర్లు తలపడనున్నారు.

మహిళల 62 కేజీల విభాగంలో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్‌... అమెనాట్ (నైజీరియా) చేతిలో 7-10 తేడాతో ఓడిపోయింది. అయితే అమెనాట్ ఫైనల్‌ చేరితే... రెపిచేజ్​ విభాగంలో సాక్షికి పతక కోసం పోరాడేందుకు మరో అవకాశం దక్కనుంది. మహిళల 53 కేజీల విభాగంలో ఇప్పటికే కాంస్య పతకం నెగ్గిన వినీశ్‌ ఫొగాట్‌.. వచ్చే ఏడాది ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.

Last Updated : Oct 1, 2019, 5:51 AM IST

ABOUT THE AUTHOR

...view details