తెలంగాణ

telangana

By

Published : Feb 26, 2020, 5:27 PM IST

Updated : Mar 2, 2020, 3:48 PM IST

ETV Bharat / sports

ఒలింపిక్స్​ పతక విజేతను ఓడించి క్వాలిఫయర్స్​కు అర్హత

భారత మహిళా రెజ్లర్ సోనమ్​ మాలిక్​ మరోసారి సత్తా చాటింది. ట్రయల్స్​లో ఒలింపిక్​ పతక విజేత సాక్షి మాలిక్​ను మట్టికరిపించింది. వరుసగా రెండోసారి సాక్షిని ఓడించిన సోనమ్​... ఆసియా ఒలింపిక్స్​ క్వాలిఫయర్స్​ పోటీలకు అర్హత సాధించింది.

Sonam Malik vs sakshi malik
సాక్షిని ఓడించిన సోనమ్​​.. ఒలింపిక్స్​ క్వాలిఫయర్స్​కు అర్హత

ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్​ ముంగిట భారత రెజ్లర్లు సాక్షి-సోనమ్​ నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు. విజయం మాత్రం సోనమ్​నే వరించింది.​ బుధవారం జరిగిన ట్రయల్స్​లో ఈమె చేతిలో వరుసగా రెండోసారి ఓడిపోయింది ఒలింపిక్​ పతక విజేత సాక్షి మాలిక్​. ఈ ఏడాది జనవరిలోనూ సోనమ్​ చేతిలోనే సాక్షికి పరాభవం ఎదురైంది.

ఈరోజు జరిగిన బౌట్​లో సాక్షి​పై ఆధిపత్యం ప్రదర్శించిన సోనమ్​​... వచ్చే నెల 27-29 తేదీల మధ్య జరగనున్న ఆసియా ఒలింపిక్స్​ క్వాలిఫయర్స్​​ పోటీలకు అర్హత సాధించింది​.

సాక్షిని ఓడించిన సోనమ్

18 ఏళ్ల సోనమ్​.. ఇటీవల జరిగిన ఆసియా ఛాంపియన్​షిప్​, రోమ్​ ర్యాంకింగ్​ సిరీస్​లో బరిలోకి దిగినా, పతకం తెచ్చుకోలేకపోయింది. అందుకే సాక్షితో 65 కేజీల విభాగంలో మళ్లీ ట్రయల్స్​ నిర్వహించారు. ఈ పోరుకు ముందు ఆసియా ఛాంపియన్​, 59 కేజీల విభాగంలో పసిడి గెలిచిన సరితపై గెలిచి ఫైనల్​కు చేరింది సోనమ్​.

ఇటీవల సాక్షికి కాంస్యం

ఇటీవల జరిగిన ఆసియా ఛాంపియన్​షిప్​లో భారత స్టార్‌ రెజ్లర్‌ సాక్షి మాలిక్‌(65కేజీలు) రజతాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్‌కు సులభంగానే చేరుకున్న సాక్షి... తుదిపోరులో 0-2తేడాతో నవోమీ రూకే(జపాన్​) చేతిలో ఓడిపోయింది.

Last Updated : Mar 2, 2020, 3:48 PM IST

ABOUT THE AUTHOR

...view details