తెలంగాణ

telangana

By

Published : Jan 25, 2020, 9:24 PM IST

Updated : Feb 18, 2020, 10:00 AM IST

ETV Bharat / sports

మణిపురి తార మేరీకోమ్​కు పద్మవిభూషణ్​

ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ మేరీకోమ్‌ను దేశ రెండో అత్యున్నత పౌరపురస్కారం పద్మవిభూషణ్‌ వరించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నేడు అవార్డును ప్రకటించింది. గతంలోనూ ఈ స్టార్​ బాక్సర్​ 2013లో పద్మభూషణ్‌, 2006లో పద్మశ్రీ పురస్కారం అందుకుంది.

Indian Women Boxer Mary Kom Named for Padma Vibhushan by Central Government
భారత బాక్సింగ్​ మహరాణి మేరీకోమ్​కు పద్మవిభూషణ్​

భారత స్టార్​ బాక్సర్​ మేరీకోమ్‌కు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్​ను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాన్ని ప్రకటించింది. మేరీకోమ్​ ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌. ఇప్పటికే ఈ స్టార్​ బాక్సర్​ 2013లో పద్మభూషణ్‌, 2006లో పద్మశ్రీ పురస్కారం అందుకుంది.

ప్రపంచ ఛాంపియన్​షిప్​లో 8 పతకాలతో చరిత్ర...

వయసు మీద పడింది.. ముగ్గురు పిల్లల తల్లి ఇక ఆమె పనైపోయిందన్నారు.. చిన్న టోర్నీల్లోనూ.. పేరు లేని ప్రత్యర్థుల చేతుల్లోనూ ఓడిపోతుంటే మళ్లీ రాణించడం కష్టమన్నారు.. ఈ విమర్శలేవీ మేరీకోమ్​ను ఆపలేకపోయాయి. గతేడాది జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటకుండా అడ్డుకోలేకపోయాయి. ఈ మణిపురి తార ఎనిమిదేళ్ల విరామం తర్వాత గతేడాది అక్టోబర్​లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటింది. ఇందులో 51 కేజీల విభాగంలో పోటీ పడిన మేరీ.. తొలిసారి ఈ విభాగంలో కాంస్యం సాధించింది. ప్రపంచ ఛాంపియన్​ షిప్​లో ఇప్పటివరకు 8 పతకాలు (ఆరు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం) గెలిచింది మేరీ కోమ్. ఇవే కాకుండా 2012 లండన్ ఒలింపిక్స్​లో కాంస్యం.. కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఈ ఏడాది ఇండియా ఓపెన్, ఇండోనేసియాలో జరిగిన ప్రెసిడెన్షియల్​ కప్​లోనూ పసిడి పతకాలు కైవసం చేసుకుంది మేరీ. ప్రపంచ టోర్నీ చరిత్రలోనే 8 పతకాలు సాధించిన బాక్సర్​గా మేరీ నిలిచింది.

Last Updated : Feb 18, 2020, 10:00 AM IST

ABOUT THE AUTHOR

...view details