తెలంగాణ

telangana

By

Published : Sep 29, 2019, 10:03 AM IST

Updated : Oct 2, 2019, 10:23 AM IST

ETV Bharat / sports

ఫైనల్లో భారత మిక్స్​డ్​ రిలే జట్టు.. ద్యుతి ఔట్​

ప్రపంచ అథ్లెట్ ఛాంపియన్​షిప్​లో భారత మిక్స్​డ్ రిలే జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరింది. 4X400 మీటర్ల రిలేలో మూడో స్థానంలో నిలిచి ఒలింపిక్స్ బెర్తు ఖరారు చేసుకుంది. భారత స్టార్ అథ్లెట్ 100 మీటర్ల రేసులో తొలిరౌండ్​లోనే ఇంటిముఖం పట్టింది.

భారత మిక్స్​డ రిలే

ఖతర్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెట్ ఛాంపియన్​షిప్​లో భారత మిక్స్​డ్​ రిలే జట్టు సత్తాచాటింది. ఈ సీజన్​లో ఉత్తమ ప్రదర్శన చేస్తూ.. ఫైనల్లో ప్రవేశించింది. శుక్రవారం జరిగిన హీట్స్‌లో మహ్మద్‌ అనాస్‌, విస్మయ, జిస్నా మాథ్యూ, నిర్మల్‌ తోమ్‌లతో కూడిన భారత జట్టు 3:16.14 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరి మూడో స్థానంలో నిలిచి ఒలింపిక్స్ బెర్తూ ఖరారు చేసుకుంది.

భారత మిక్స్​డ్​ రిలే టీమ్​

తొలి లెగ్‌లో మహ్మద్‌ అనాస్‌ వేగంగా పరుగెత్తి విస్మయకు బ్యాటన్‌ అందించగా..ఈ కేరళ అథ్లెట్‌ అందరిని ఆశ్చర్యపరుస్తూ రేసులో అగ్రస్థానంలో దూసుకెళ్లింది. ఆమె నుంచి బ్యాటన్‌ను అందుకున్న జిస్నా మాథ్యూ.. విస్మయ అంత వేగంగా పరుగెత్తలేకపోయింది. నిర్మల్‌ తోమ్‌కు బ్యాటన్‌ అందించడంలోనూ తడబడింది. అయితే చివరి 400 మీటర్లలో గొప్పగా దూసుకెళ్లిన నిర్మల్‌.. రేసును మూడో స్థానంతో ముగించాడు. ఇదే విభాగంలో అమెరికా జట్టు (3:12.42 ని) ప్రపంచ రికార్డు సృష్టిస్తూ అగ్రస్థానంలో నిలిచింది.

ద్యుతి తొలిరౌండ్​లోనే..

హాట్​ఫేవరెట్​గా బరిలో దిగిన ద్యుతిచంద్ తొలిరౌండ్​లోనే ఇంటిముఖం పట్టింది. 100 మీటర్ల పరుగులో హీట్​-3లో తలపడిన ద్యుతి.. 11.48 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ఏడో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఆసియా ఛాంపియన్‌షిప్‌ హీట్స్‌లో 11.28, సెమీఫైనల్లో 11.26 సెకన్ల (జాతీయ రికార్డు) టైమింగ్‌ నమోదు చేసిన ద్యుతి.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోయింది.

ఇదీ చదవండి: అథ్లెటిక్స్ ఛాంపియన్​షిప్​ నుంచి ద్యుతి ఔట్..!

Last Updated : Oct 2, 2019, 10:23 AM IST

ABOUT THE AUTHOR

...view details