భారత్ తరఫున ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన అథ్లెట్ ఇక్బాల్ సింగ్.. అమెరికాలో జరిగిన హత్యకేసులో అరెస్టయ్యాడు. తన భార్య, తల్లిని హత్య చేసినట్లు ఇక్బాల్ అంగీకరించాడని స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. 62 ఏళ్ల ఇక్బాల్ డెల్వార్ కౌంటీలో నివాసం ఉంటున్నాడు. ఆయన ఆదివారం పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించాడట.
"ఆదివారం పోలీసులు ఇక్బాల్ ఇంటికి వెళ్లేసరికి అతని శరీరంపై కత్తిగాట్లు ఉన్నాయి. విపరీతంగా రక్తం కారుతోంది. అదే ఇంట్లో రెండు మృతదేహాలు దొరికాయి. సింగ్కు అయిన గాయాలు సొంతంగా చేసుకొన్నవే" అని పోలీసులు తెలిపారు. క్రూరంగా హత్య చేయడం వంటి అభియోగాలాను మోపి అతడిపై కేసు నమోదు చేశారు. నేరాల తీవ్రత చూస్తే బెయిల్ కూడా వచ్చే అవకాశం లేదు.