తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇటలీలో శిక్షణ ప్రారంభించిన భారత బాక్సర్లు

ఇటలీలోని ఒలింపిక్స్ కేంద్రంలో భారత బాక్సర్లు తమ ప్రత్యేక శిక్షణను ప్రారంభించారు. 10 మంది పురుష బాక్సర్లు ఈ ప్రాక్టీస్​లో పాల్గొన్నారు..

By

Published : Oct 24, 2020, 10:24 AM IST

Indian boxing team resumes training in Italy
ఇటలీలో ప్రత్యేక శిక్షణకు హాజరైన భారతీయ బాక్సర్లు

భారత బాక్సర్లు తమ ప్రాక్టీస్​ను తిరిగి ప్రారంభించారు. ఇటలీలోని అస్సిస్సి ఒలింపిక్స్ కేంద్రంలో పురుష బాక్సర్లు తమ శిక్షణ మొదలుపెట్టారు. 52 రోజుల పాటు ఈ శిక్షణా శిబిరం కొనసాగనుంది.

" అధికారుల సూచనల మేరకు భారత్​కు చెందిన 10 మంది పురుష బాక్సర్లు విదేశాల్లో వారి శిక్షణను ప్రారంభించారు".

-సాయ్ ప్రకటన.

ఈనెల ప్రారంభంలో.. శిక్షణ నిమిత్తం బాక్సర్లను విదేశాలకు పంపిస్తామని స్పోర్ట్స్ అథారిటీ వెల్లడించింది. 10 మంది పురుష బాక్సర్లు, ఆరుగురు మహిళా బాక్సర్లు, ఇతర సహాయ సిబ్బందితో కలిపి మొత్తం 28 మంది బృందాన్ని ఇటలీ, ఫ్రాన్స్​లకు పంపిస్తున్నట్లు పేర్కొంది.

ఆ బాక్సర్లు వీరే..

టోక్యో ఒలింపిక్స్​లో అమిత్ పంగాల్, ఆశిష్ కుమార్, సతీష్ కుమార్, సిమ్రన్ జిత్ కౌర్, లవ్నీనా, పూజా రాణి ఇప్పటికే కోటా సంపాదించారు.

ఇదీ చదవండి:పంజాబ్​​xహైదరాబాద్​: ఫ్లే ఆఫ్స్​కు చేరాలంటే గెలవాల్సిందే

ABOUT THE AUTHOR

...view details