తెలంగాణ

telangana

By

Published : Oct 30, 2019, 4:03 PM IST

Updated : Oct 30, 2019, 4:11 PM IST

ETV Bharat / sports

ఒలింపిక్ టెస్ట్ ఈవెంట్​ ఫైనల్లో భారత బాక్సర్లు

ఒలింపిక్ టెస్ట్ ఈవెంట్​ సెమీస్​లో భారత్​ బాక్సర్ శివ థాపా(63 కేజీలు).. జపాన్​కు చెందిన డైసుకేపై నెగ్గి ఫైనల్​లో అడుగుపెట్టాడు.​ భారత్​కు చెందిన పూజారాణి(75 కేజీలు).. బ్రెజిల్ క్రీడాకారిణి బియాత్రిజ్​ను ఓడించింది.

ఒలింపిక్ టెస్ట్ ఈవెంట్​లో ఫైనల్లో భారత బాక్సర్లు

జపాన్ టోక్యో వేదికగా జరుగుతున్న ఒలింపిక్ టెస్ట్ ఈవెంట్​లో భారత బాక్సర్లు సత్తాచాటుతున్నారు. బుధవారం జరిగిన సెమీ ఫైనల్లో గెలిచిన శివథాపా, పూజారాణి.. ఫైనల్​కు అర్హత సాధించారు.

పురుషుల63 కేజీల విభాగంలో జపాన్​కు చెందిన డైసుకే నారిమత్సుపై విజయం సాధించాడు శివ థాపా. నాలుగుసార్లు ఆసియన్ ఛాంపియన్​షిప్​లో పతకాలు గెలిచిన ఈ బాక్సర్ పంచ్​లకు ప్రత్యర్థి నేలకొరిగాడు.

మహిళల75 కేజీల విభాగంలో బ్రెజిల్​కు చెందిన బియాత్రిజ్ సోర్స్​ను ఓడించింది పూజా రాణి. ఈ ఏడాది జరిగిన ఆసియా ఛాంపియన్​షిప్​లో రజతం నెగ్గిన పూజ.. ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించింది.

సెమీస్మరో మ్యాచ్​​.. 51 కేజీల విభాగంలో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్, వహ్లీంపుయా(75 కేజీల) పరాజయం పాలయ్యారు. కానీ కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు.

Last Updated : Oct 30, 2019, 4:11 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details