తెలంగాణ

telangana

By

Published : Sep 27, 2019, 5:11 AM IST

Updated : Oct 2, 2019, 4:23 AM IST

ETV Bharat / sports

అంచనాల్లేకుండా బరిలో దిగుతోన్న భారత అథ్లెట్లు

నేటి నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్​షిప్ పోటీల్లో అంచనాల్లేకుండా బరిలోకి దిగుతోంది భారత దళం. ప్రముఖ అథ్లెట్లు హిమదాస్, నీరజ్ చోప్రా గాయాల కారణంగా గైర్హాజరయ్యారు.

అంచనాల్లేకుండా బరిలో దిగుతోన్న భారత అథ్లెట్లు

ఖతార్​లో శుక్రవారం నుంచి ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్​షిప్ ప్రారంభం కానుంది. ప్రముఖ క్రీడాకారులైన హిమదాస్,నీరజ్ చోప్రా లేకుండానేఈ పోటీల్లో బరిలోకి దిగుతోంది భారత బృందం. మోచేయి చికిత్స కారణంగా నీరజ్, వెన్నెముక గాయంతో హిమదాస్​ ఈ టోర్నీకి దూరమయ్యారు.

2017 లండన్​లో జరిగిన గత ఎడిషన్​లో కేవలం ఒకే ఒక్క భారతీయ అథ్లెట్​(జువెలిన్ త్రో విభాగంలో దేవిందర్ సింగ్ కంగ్) మాత్రమే ఫైనల్​కు చేరాడు. రేస్​ వాకర్స్, మారథాన్ క్రీడాకారులు తమ తమ విభాగాల్లో నిరుత్సాహపరిచారు.

ఇప్పుడు వెళుతున్న 27 మంది సభ్యుల భారత బృందంలో 13 మంది అథ్లెట్లు రిలేలో పాల్గొననున్నారు. ధరుణ్ అయ్యస్వామి 400 మీటర్ల హర్డిల్స్ విభాగంలో పోటీ పడనున్నాడు. జాతీయ పతక విజేత మహమ్మద్​ అనాస్.. క్వాలిఫికేషన్​ మార్క్​ను అందుకోని కారణంగా అర్హత సాధించలేకపోయాడు.​

అన్ని రిలే పరుగు పందేల్లో తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన వారు వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్​లో పాల్గొనే అవకాశం పొందుతారు.

భారత అథ్లెట్లలో లాంగ్ జంపర్ శ్రీశంకర్, మెట్రిక్ రన్నర్ జిన్సన్ జాన్సన్, షాట్​పుట్ క్రీడాకారుడు తేజిందర్ పాల్ సింగ్, స్ప్రింటర్ ద్యుతీ చంద్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ టోర్నీలో భారత ప్రయాణాన్ని ఆరంభించనున్నాడు శ్రీశంకర్.

ఇది చదవండి: అథ్లెటిక్స్: వినూత్న ఆలోచనలు.. మరెన్నో అద్భుతాలు

Last Updated : Oct 2, 2019, 4:23 AM IST

ABOUT THE AUTHOR

...view details