కరోనా ప్రభావం వల్ల ఈ జులై నుంచి జరగాల్సిన ఒలింపిక్స్.. వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. అయితే టోక్యోలో నిర్వహించే ఈ మెగాక్రీడల్ని మరోసారి వాయిదా వేయడం అసాధ్యమని స్పష్టం చేశారు నిర్వహణ కమిటీ అధ్యక్షుడు యోషిరొ మోరి. 2021 జులై 23న ఎట్టి పరిస్థితిలోనైనా ప్రారంభమవుతాయని అన్నారు. వాయిదా వ్యవధి పెరిగితే సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుందని అన్నారు. ఈ విషయాల్ని ఓ వార్త ఏజెన్సీ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఒలింపిక్స్ రెండేళ్ల వాయిదాపై జపాన్ ప్రధాని షింజో అబెతో తాను మాట్లాడానని చెప్పిన మోరి.. ఆయన ఏడాది సమయం సరిపోతుందని చెప్పినట్లు పేర్కొన్నారు.