తెలంగాణ

telangana

ETV Bharat / sports

గోల్డ్ గెలవకపోయినా.. ప్రేక్షకుల గుండెల్లో నిలిచాడు - Runner wins hearts by helping rival cross the finish line

శుక్రవారం జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్​షిప్​లో గున్యా దేెశానికి చెందిన రన్నర్ బ్రైమా సుంకర్ తన క్రీడాస్ఫూర్తితో అందరి ప్రశంసలు అందుకున్నాడు. అలసిపోయి పరుగెత్తలేకపోయిన అరుబా రన్నర్ బ్రైమా సుంకర్​కు సాయమందించి ప్రేక్షకుల మనసులు గెలిచాడు.

అథ్లెట్

By

Published : Sep 28, 2019, 1:19 PM IST

Updated : Oct 2, 2019, 8:22 AM IST

దోహా వేదికగా జరుగుతోన్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్​షిప్​ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ టోర్నీలో 5000 మీటర్ల పరుగు పందెం ఉత్కంఠగా సాగుతుండగా.. ఇంకో రౌండు అయితే రేసు పూర్తవుతుందనగా అరుబా దేశానికి చెందిన రన్నర్ జోనాథన్​ అలసిపోయి పరుగెత్తలేకపోయాడు.. అది చూసిన గున్యా అథ్లెట్ బ్రైమా సుంకర్ డాబో తన పరుగుని ఆపుకుని జోనాథన్​కు సాయమందించాడు. ఈ సంఘటన చూసిన అందరూ డాబో క్రీడాస్ఫూర్తికి ఫిదా అయ్యారు.

ఆఖరి రౌండ్ పూర్తి చేసే వరకు జోనాథన్​కు తోడుగా ఉండి.. అందరి మన్ననలు అందుకున్నాడు డాబో. తోటి రన్నర్లంతా పరుగును పూర్తి చేసి ఐదు నిమిషాలు గడిచిన తర్వాత అరుబా రన్నర్​తో కలిసి గమ్యాన్ని చేరుకున్నాడు. రేసులో పతకం గెలవకపోయినా.. తన బంగారు మనసుతో ప్రేక్షకుల గుండెల్లో గోల్డ్ సాధించాడు డాబో.

ఇదీ చదవండి: నీటిలో క్రికెట్ ప్రాక్టీస్ చేసిన మాస్టర్ బ్లాస్టర్

Last Updated : Oct 2, 2019, 8:22 AM IST

ABOUT THE AUTHOR

...view details