తెలంగాణ

telangana

By

Published : Aug 18, 2019, 6:34 PM IST

Updated : Sep 27, 2019, 10:24 AM IST

ETV Bharat / sports

హిమాదాస్ ఖాతాలో ఆరో స్వర్ణం

భారత మహిళా స్ర్పింటర్​ హిమాదాస్ చెక్​ రిపబ్లిక్​లో జరిగిన అథ్లెటికీ మిట్నిక్ రాయిటర్​ ఈవెంట్​ 300మీ విభాగంలో స్వర్ణం నెగ్గింది.

హిమాదాస్

భారత స్ప్రింటర్​ హిమాదాస్ మరో స్వర్ణం నెగ్గింది. చెక్ రిపబ్లిక్​లో జరిగిన అథ్లెటికీ మిట్నిక్ రాయిటర్​ ఈవెంట్​ 300మీ విభాగంలో పసిడిని కైవసం చేసుకుంది. హిమతో పాటు మరో అథ్లెట్​ మహ్మద్​ అనాస్​ పురుషులు 300మీ రేసులో గోల్డ్​ను సాధించాడు.

మహ్మద్ అనాస్

జులై 2 నుంచి హిమాదాస్​కిది ఆరో స్వర్ణం. చివరగా జులై 20న చెక్​ రిపబ్లిక్​లో జరిగిన నోవే మెస్టో ఈవెంట్​ 400మీ విభాగంలో పసిడి నెగ్గింది.

దోహాలో సెప్టెంబర్​-అక్టోబర్​లో జరిగే ప్రపంచ ఛాంపియన్​ షిప్​ పోటీలకు ఇప్పటికే మహ్మద్ అనాస్​ క్వాలిఫై అయ్యాడు. హిమదాస్​కు ఇంకా చోటు లభించలేదు.

ఇవీ చూడండి.. పులిబిడ్డకు బారసాల.. హిమాదాస్​గా నామకరణం!

Last Updated : Sep 27, 2019, 10:24 AM IST

ABOUT THE AUTHOR

...view details