ప్రముఖ భారత మహిళా స్ప్రింటర్ హిమాదాస్.. అద్భుత ప్రదర్శనలతో చెలరేగుతోంది. కేవలం 15 రోజుల వ్యవధిలోనే 4 బంగారు పతకాలు సాధించింది. బుధవారం చెక్ రిపబ్లిక్లో జరిగిన టబోర్ అథ్లెటిక్స్ మీట్లో 200 మీటర్ల రేసులో అత్యుత్తమ టైమింగ్ నమోదు చేసింది. ఈ రేసును 23.25 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానం సంపాదించింది. 200 మీటర్ల పరుగు పందెంలో ఆమె ఇప్పటికే 23.10 సెకన్లతో వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్ నమోదు చేసింది.
- జూలై 2న పోలాండ్లో జరిగిన పొజనాన్ గ్రాండ్ ప్రిక్స్ 200 మీటర్ల పందెంలో 23.65 సెకన్లతో తొలి బంగారు పతకం సొంతం చేసుకుంది.
- జూలై 7న అదే పోలాండ్లో జరిగిన కుంటో అథ్లెటిక్స్ మీట్లో 200 మీటర్లను 23.97 సెకన్లలో పూర్తి చేసి రెండో బంగారు పతకం సాధించింది.
- జూలై 13న చెక్ రిపబ్లిక్లో జరిగిన క్లాండో మీట్లో 200 మీటర్ల రేసును 23.43 సెకన్లలో పరుగెట్టింది. మూడో గోల్డ్ మెడల్ పొందింది.