తెలంగాణ

telangana

By

Published : Jul 18, 2019, 1:27 PM IST

ETV Bharat / sports

హిమాదాస్​కు 15 రోజుల్లో 4 బంగారు పతకాలు

భారత మహిళా రన్నర్ హిమాదాస్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి 15 రోజుల స్వల్ప వ్యవధిలోనే నాలుగు బంగారు పతకాలు సొంతం చేసుకుంది.

హిమాదాస్​కు 15 రోజుల్లో 4 బంగారు పతకాలు

ప్రముఖ భారత మహిళా స్ప్రింటర్ హిమాదాస్.. అద్భుత ప్రదర్శనలతో చెలరేగుతోంది. కేవలం 15 రోజుల వ్యవధిలోనే 4 బంగారు పతకాలు సాధించింది. బుధవారం చెక్ రిపబ్లిక్​లో జరిగిన టబోర్ అథ్లెటిక్స్ మీట్​లో 200 మీటర్ల రేసులో అత్యుత్తమ టైమింగ్ నమోదు చేసింది. ఈ రేసును 23.25 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానం సంపాదించింది. 200 మీటర్ల పరుగు పందెంలో ఆమె ఇప్పటికే 23.10 సెకన్లతో వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్​ నమోదు చేసింది.

భారత మహిళా స్ప్రింటర్ హిమాదాస్
  1. జూలై 2న పోలాండ్​లో జరిగిన పొజనాన్ గ్రాండ్​ ప్రిక్స్​ 200 మీటర్ల పందెంలో 23.65 సెకన్లతో తొలి బంగారు పతకం సొంతం చేసుకుంది.
  2. జూలై 7న అదే పోలాండ్​లో జరిగిన కుంటో అథ్లెటిక్స్ మీట్​లో 200 మీటర్లను 23.97 సెకన్లలో పూర్తి చేసి రెండో బంగారు పతకం సాధించింది.
  3. జూలై 13న చెక్ రిపబ్లిక్​లో జరిగిన క్లాండో మీట్​లో 200 మీటర్ల రేసును 23.43 సెకన్లలో పరుగెట్టింది. మూడో గోల్డ్ మెడల్ పొందింది.

వరల్డ్ ఛాంపియన్​షిప్​కు అర్హత సాధించాలంటే 400 మీటర్లను 51.80 సెకన్లలో, 200 మీటర్లను 23.02 సెకన్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. మరి ఈ అసోం రన్నర్ వీటిని సాధిస్తుందేమో చూడాలి.

ఇది చదవండి: 'క్రికెట్ ముందు నా విజయం ఓడిపోయింది' అంటున్న రన్నర్ ద్యుతీ చంద్

ABOUT THE AUTHOR

...view details