తెలంగాణ

telangana

By

Published : Apr 23, 2021, 7:45 AM IST

ETV Bharat / sports

అమ్మాయిల పంచ్​ అదరహో.. భారత్​కు ఏడు స్వర్ణాలు

ప్రపంచ యూత్​ బాక్సింగ్​ ఛాంపియన్​షిప్స్​ ఫైనల్స్​​లో భారత అమ్మాయిలు సత్తా చాటారు. తుదిపోరుకు చేరుకున్న ప్రతి బాక్సర్​ విజేతగా నిలిచి స్వర్ణం చేజిక్కించుకున్నారు. పురుషుల విభాగంలో శుక్రవారం జరగనున్న ఫైనల్​లో భారత బాక్సర్​ సచిన్(56 కేజీ) బరిలో దిగనున్నాడు.

Gitika, Babyrojisana win gold medals
అమ్మాయిల పంచ్​ అదరహో

ప్రపంచ యూత్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత అమ్మాయిలు సత్తా చాటారు. అదిరే ప్రదర్శనతో పసిడి పంట పండించారు. గురువారం జరిగిన ఫైనల్స్​లో నెగ్గి ఏకంగా ఏడు స్వర్ణాలు చేజిక్కించుకున్నారు. మహిళల విభాగంలో ఫైనల్‌ చేరిన వారందరూ విజేతలుగా నిలిచారు.

గీతిక (48కేజీ), బేబీరోజిసనా (51కేజీ), పూనమ్‌ (57కేజీ), వింకా (60కేజీ), అరుంధతి చౌదరి (69కేజీ), సనామచు చాను (75కేజీ), అల్ఫియా పఠాన్‌ (+81కేజీ) తమ తమ విభాగాల్లో నెగ్గారు.

ఫైనల్స్‌లో గీతిక 5-0తో కుజెస్కా (పోలెండ్‌)పై, బేబీరోజిసనా 5-0తో లింకోవా (రష్యా)పై, పూనమ్‌ 5-0తో గ్రోషీ (ఫ్రాన్స్‌)పై గెలిచారు. వింకా.. కజకిస్థాన్‌కు చెందిన షయక్మెతోవాను ఓడించింది. అరుంధతి 5-0తో బార్బరా (పోలెండ్‌)పై, అల్ఫియా 5-0తో కొజోరెజ్‌ (మాల్దోవా)పై నెగ్గింది.

ఇక సనామచు చాను కజకిస్థాన్‌ అమ్మాయి డానా డిడేను మట్టికరిపించింది. ప్రపంచ యువ బాక్సింగ్‌ మహిళల విభాగంలో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. 2017లో ఐదు స్వర్ణాలతో సాధించిన రికార్డును అధిగమించింది.

ఈ టోర్నీలో మరో భారత బాక్సర్‌ ఫైనల్లో పోటీపడాల్సివుంది. పురుషుల విభాగంలో సచిన్‌ (56 కేజీ) శుక్రవారం బరిలో దిగనున్నాడు.

ఇదీ చూడండి..బాక్సింగ్‌లో భారత్‌ జోరు.. ఫైనల్స్​కు ఎనిమిది మంది

ABOUT THE AUTHOR

...view details