తెలంగాణ

telangana

By

Published : Jun 7, 2021, 11:00 AM IST

ETV Bharat / sports

వ్యాక్సినేషన్​పై కేరళ ప్రభుత్వానికి పీటీ ఉష విన్నపం

క్రీడాకారులకు వీలైనంత త్వరగా టీకాలు వేయాలని కేరళ ప్రభుత్వానికి విన్నవించుకుంది పీటీ ఉష. క్రీడాశాఖను అశ్రద్ధ చేయకూడదని వెల్లడించింది.

usha
ఉష

ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ వైరస్ మహమ్మారి కారణంగా ఇప్పటికే పలు క్రీడాటోర్నీలు రద్దవగా.. వాటిని పునఃప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు నిర్వాహకులు. అయితే ఇందులో పాల్గొనాలంటే వ్యాక్సినేషన్ తప్పనిసరి. అందువల్ల క్రీడాకారులకు టీకా వేయించేందుకు ఇప్పటికే కృషి చేస్తోంది క్రీడామంత్రిత్వ శాఖ. తాజాగా అథ్లెట్లకు వ్యాక్సిన్ విషయంపై కేరళ ప్రభుత్వం, క్రీడాశాఖకు విన్నవించింది ప్రముఖ అథ్లెట్ పీటీ ఉష.

"త్వరలో ప్రారంభంకాబోయే జాతీయ, మిగతా పోటీల్లో పాల్గొనడానికి వీలుగా క్రీడా వ్యక్తులు, కోచ్​లు, సహాయ సిబ్బంది, మెడికల్ సిబ్బందికి త్వరగా టీకాలు వేయాలని కేరళ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నా. క్రీడా విభాగాన్ని అశ్రద్ధ చేయకూడదు."

-పీటీ ఉష, అథ్లెట్

1980వ దశకంలో ఆసియాలోనే అత్యుత్తమ​ అథ్లెట్​గా పేరు తెచ్చుకుంది ఉష. 1984 లాస్ ఏంజెలిస్​ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల హర్డిల్స్‌లో సెకను​లో వందో వంతు తేడాతో కాంస్య పతకం కోల్పోయింది. 1986 సియోల్​ వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో నాలుగు స్వర్ణాలు సహా ఐదు పతకాలు నెగ్గిందీ స్టార్​ స్ప్రింటర్​. జకార్తా వేదికగా జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్‌లో ఐదు స్వర్ణాలు, కాంస్యంతో సత్తాచాటింది.

ABOUT THE AUTHOR

...view details