మరో ఆరురోజుల్లో ఒలింపిక్స్(Tokyo Olympics) క్రీడా సంబరం మొదలవనున్న వేళ.. కరోనా వైరస్ కలకలం రేపింది. ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో తొలి కరోనా కేసు నిర్ధరణ అయ్యింది. స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తుండగా గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్గా తేలినట్లు టోక్యో నిర్వాహక కమిటీ ప్రతినిధి మాసా టకాయా శనివారం వెల్లడించారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఆ వ్యక్తి పేరు, ఇతర వివరాలను బయటపెట్టలేదు.
ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ నిమిత్తం విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి కరోనా బారినపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడిని ఒలింపిక్ గ్రామం నుంచి బయటకు తీసుకొచ్చి ఓ హోటల్లో ఐసోలేషన్లో ఉంచినట్లు మాసా టకాయా తెలిపారు. గ్రామంలో కరోనా వ్యాప్తి జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నామని నిర్వాహకులు తెలిపారు.