తెలంగాణ

telangana

By

Published : Jun 4, 2020, 1:27 PM IST

Updated : Jun 4, 2020, 2:47 PM IST

ETV Bharat / sports

కన్నీటి 'పరుగు': అప్పుడు పతకం కోసం.. ఇప్పుడు నీటి కోసం

భారతదేశంలో ఇప్పటికీ గుక్కెడు నీటి కోసం ఇబ్బందులు తప్పట్లేదు! సాధారణ ప్రజల నుంచి దేశం మెచ్చిన క్రీడాకారుల వరకు ఎవరూ ఈ సమస్యకు అతీతులు కారు. ఒకప్పుడు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ పతకాల కోసం పరుగెత్తిన ఓ అథ్లెట్​.. నేడు నీటి కోసం బిందెలు మోస్తోంది. ఆమె 2018లో ఆసియన్​ గేమ్స్​లో భారత్​కు పసిడి తెచ్చిన రిలే రేసర్​ సరితాబెన్​ గైక్వాడ్​. గుజరాత్​లోని తన స్వగ్రామంలో నీటి సమస్యను 'ఈటీవీ-భారత్'​ దృష్టికి తీసుకొచ్చింది.

EXCLUSIVE: Asian Games gold medallist Saritaben walks for drinking water
అప్పుడు పతకం కోసం పరుగులు.. ఇప్పుడు నీటి కోసం అడుగులు

దేశానికి పతకం తెచ్చేందుకు శ్రమించిన ఓ స్ప్రింటర్​.. ప్రస్తుతం తన గ్రామంలో నీటి కష్టాలు ఎదుర్కొంటోంది. ట్రాక్​పై పతకం కోసం పరుగెత్తిన ఆమె.. తాగునీటి కోసం బిందె పట్టుకొని నడుస్తోంది. ఏళ్లుగా తన గ్రామంలోని ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా 'ఈటీవీ భారత్'​కు తన ఆవేదన చెప్పుకుంది స్టార్​ అథ్లెట్​ సరితాబెన్​ గైక్వాడ్.

సరితాబెన్​ స్వస్థలం.. గుజరాత్​ డాంగ్​ జిల్లాలోని ఖరాది అంబా గ్రామం. తమ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా తీవ్ర నీటి ఎద్దడి ఉన్నట్లు చెప్పింది. ఈ నీటి సంక్షోభంపై ప్రభుత్వాలు స్పందించి సమస్య పరిష్కారం చేయాలని కోరింది.

రేసర్​ సరితాబెన్​ గైక్వాడ్​తో ఈటీవీ భారత్​ ప్రత్యేక ఇంటర్వ్యూ

"12 ఏళ్ల క్రితం నేను ఈ గ్రామంలో నివసించే సమయంలో ఐదు కిలోమీటర్లు నడిచివెళ్లి చిన్​చలి గ్రామం నుంచి నీటిని తెచ్చేదాన్ని. కానీ, గత 8 సంవత్సరాలుగా నా చదువు కోసం హాస్టల్​లో ఉంటున్నా. క్రీడల్లో మంచి ప్రదర్శన వల్ల మరో దేశాలలో శిక్షణ కోసం వెళ్లాను. దీని వల్ల మా గ్రామ ప్రజలు, నా కుటుంబ సభ్యులు పడుతున్న కష్టాలు నాకు తెలిసేవి కావు. ఇన్ని ఏళ్ల తర్వాత లాక్​డౌన్​ కారణంగా ఏప్రిల్​ నుంచి ఇంటికే పరిమితమయ్యాను.ఇప్పటికీ ఆనాటి తాగునీటి సమస్య ఎదుర్కోవడం బాధగా ఉంది. గ్రామస్థులు ఇప్పటికీ కిలోమీటరు నడిచి వెళ్లి మంచినీటిని తెచ్చుకుంటున్నారు".

- సరితాబెన్​ గైక్వాడ్​, భారత అథ్లెట్​

వర్షపాతం ఎక్కువే కానీ..

సరితాబెన్​ స్వగ్రామమైన ఖరాది అంబా పరిసర గ్రామాల్లో వర్షపాతం ఎక్కువే. కానీ డాంగ్​ జిల్లా అంతటా పర్వతాలు వ్యాపించి ఉండటం వల్ల వాననీటిని నిల్వ చేసుకోవడం కష్టమైన పని. దీనివల్ల ఆ గ్రామ ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. వేసవిలో ఆ సమస్య మరింత ఎక్కువ అవుతోంది. అధికారుల నివేదిక ప్రకారం ఆ పరిసర ప్రాంతాల్లోని వేసవిలో భూగర్భ నీటి మట్టం 150 అడుగుల వరకు తగ్గుతుంది.

వర్షాకాలంలో డాంగ్‌ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయి. ఆ నీటిని ఒడిసిపట్టి నిల్వ చేసేందుకు చెక్​డ్యామ్​ల​ వంటి నిర్మాణాలు చేపట్టాలని కోరింది సరితాబెన్​.

హిమాదాస్​ టీమ్​ మెంబర్​

2018లో జరిగిన ఆసియన్​ గేమ్స్​లో 4x400 మీటర్ల రిలే పరుగు పందెంలో బంగారు పతకాన్ని సాధించిన బృందంలో సరితాబెన్​ గైక్వాడ్ సభ్యురాలు. హిమాదాస్​, ఎమ్​.ఆర్​. పూవమ్మ, విస్మయతో కలిసి పసిడి పతకాన్ని సాధించింది​. కేవలం 3 నిమిషాల 28.72 సెకన్లలోనే ఈ రేసును పూర్తి చేసిందీ బృందం. ఈ ఘనత సాధించిన తర్వాత దేశమంతా వారిపై ప్రశంసలు కురిపించింది.

ఆసియన్​ గేమ్స్​లో రిలే పరుగులో పసిడి సాధించిన బృందం

ఇదీ చూడండి... కరోనా పాజిటివ్​ వచ్చినా.. కారు జోరు ఆగదు

Last Updated : Jun 4, 2020, 2:47 PM IST

ABOUT THE AUTHOR

...view details