తెలంగాణ

telangana

By

Published : Jul 11, 2020, 8:15 AM IST

ETV Bharat / sports

'చెమటతో బంతికి మెరుపు తెప్పిస్తున్నాం'

వెస్టిండీస్​తో జరుగుతున్న తొలి టెస్టులో బంతి మెరుపు కోసం చెమటను ఉపయోగిస్తున్నట్లు ఇంగ్లాండ్​ బౌలర్​ మార్క్ వుడ్​ తెలిపాడు. కరోనా నేపథ్యంలో క్రీడా కార్యక్రమాలు మూడు నెలల పాటు నిలిచిపోయిన అనంతరం.. ఇంగ్లాండ్​, వెస్టిండీస్​ మధ్య తొలి టెస్టు సిరీస్​ జరుగుతోంది.

England bowlers using back sweat to shine the ball
మార్క్​ వుడ్​

బంతిపై లాలాజలం వినియోగంపై ఐసీసీ నిషేధం విధించిన నేపథ్యంలో.. వెస్టిండీస్​తో జరుగుతున్న తొలి టెస్టులో బంతి మెరుపు కోసం తాము చెమటనే ఉపయోగిస్తున్నట్లు ఇంగ్లాండ్​ బౌలర్​ మార్క్​ వుడ్​ తెలిపాడు.మ్యాచ్​ ఆడే సమయంలో ఆటగాళ్ల మెడపై వీపులో ఎక్కువగా చెమట పడుతుంది. దాన్నే బంతిపై మెరుపు కోసం ఉపయోగిస్తున్నాం. అండర్సన్​, ఆర్చర్​ల సాయం తీసుకొని బంతికి చెమటతో మెరుపు తెప్పించే ప్రయత్నం చేశా అని వుడ్​ తెలిపాడు.

ఇంగ్లాండ్​, వెస్టిండీస్​ మధ్య జరుగుతోన్న తొలి టెస్ట్​లో వెస్టిండీస్​ జట్టు అధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్​ 204 పరుగులు చేయగా.. కరీబియన్​ జట్టు 114 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ కొనసాగుతోంది.

ఇదీ చూడండి:సౌథాంప్టన్​ టెస్ట్​: విండీస్​ 318 ఆలౌట్​- ఇంగ్లాండ్​పై ఆధిక్యం

ABOUT THE AUTHOR

...view details