తెలంగాణ

telangana

By

Published : Jul 10, 2019, 8:41 AM IST

ETV Bharat / sports

పరుగు రికార్డు: చరిత్ర సృష్టించిన ద్యుతి

నెపోలిలో జరుగుతోన్న 30వ ప్రపంచ యూనివర్సిటీ పోటీల్లో భారత స్ప్రింటర్ ద్యుతిచంద్ స్వర్ణం సాధించింది. ప్రపంచస్థాయి పోటీల్లో ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది.

ద్యుతిచంద్

ఇటలీలోని నెపోలిలో జరుగుతున్న 30వ ప్రపంచ యూనివర్సిటీ పోటీల్లో స్ప్రింటర్ ద్యుతిచంద్ స్వర్ణపతకం గెలుచుకుంది. 100 మీటర్ల విభాగంలో 11.32 సెకన్లలో రేసును పూర్తి చేసి రికార్డు సృష్టించింది. ప్రపంచస్థాయి పోటీల్లో 100 మీటర్ల విభాగంలో భారత మహిళ స్వర్ణం సాధించడం ఇదే తొలిసారి.

ఇదే విభాగంలో స్విట్జర్లాండ్​కు చెందిన అజ్లా డెల్ పొంటే 11.33 సెకన్లలో రేసు పూర్తి చేసి రజతం సాధించింది.

"స్వర్ణం సాధించడం పట్ల చాలా ఆనందంగా ఉంది. ఈ ఘనత సాధించిన మొదటి భారత మహిళ కావడం మరింత సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ పతకాన్ని కేఐఐటీ యూనివర్సిటీ, విశ్వవిద్యాలయ స్థాపకులు ప్రొఫెసర్ సమంత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్​లకు అంకితం ఇస్తున్నాను. వారు నాకెంతో మద్దతుగా నిలిచారు".

-ద్యుతిచంద్, భారతీయ స్ప్రింటర్

స్వర్ణం సాధించినందుకు భారత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్.. ద్యుతిచంద్​కు శుభాకాంక్షలు తెలిపారు. మొదటి భారతీయ మహిళగా పసిడి నెగ్గి చరిత్ర సృష్టించినందుకు సంతోషంగా ఉందని.. మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.

ఇవీ చూడండి.. రికార్డుల 'హిమా': ఒకే వారంలో రెండు స్వర్ణాలు

ABOUT THE AUTHOR

...view details