తెలంగాణ

telangana

By

Published : Feb 17, 2020, 9:49 PM IST

Updated : Mar 1, 2020, 4:07 PM IST

ETV Bharat / sports

ఆసియన్ ఛాంపియన్​షిప్​: చైనాకు నో.. పాక్​కు ఓకే

రేపటి నుంచి న్యూదిల్లీ వేదికగా జరగనున్న ఆసియన్ రెజ్లింగ్ ఛాంపియన్​ షిప్​లో చైనా రెజ్లర్లు పాల్గొనట్లేదు. కరోనా వైరస్ కారణంగా వారికి వీసాలు నిరాకరించింది భారత ప్రభుత్వం. పాక్​ ఆటగాళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

చైనా
చైనా

న్యూదిల్లీలో జరిగే ఆసియన్ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో చైనా బృందం పాల్గొనే అవకాశం లేదని భారత రెజ్లింగ్ సమాఖ్య అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్ స్పష్టం చేశారు. కరోనా వైరస్​ కారణంగా వారికి వీసాలు ఇవ్వబోమని చెప్పారు. ఫలితంగా చైనాకు చెందిన 40 మంది రెజ్లర్లు ఈ పోటీల్లో పాల్గొనట్లేదు.

అయితే పాకిస్థాన్​కు చెందిన రెజ్లర్లు మాత్రం ఈ పోటీల్లో పాల్గొననున్నారు. ఈ నెల 18 నుంచి 24 వరకు జరిగే ఈ టోర్నీలో పాల్గొనడానికి పాక్ రెజ్లర్లకు ప్రభుత్వం వీసా మంజూరు చేసింది. ఫలితంగా పుల్వామా దాడి తర్వాత భారత్‌లో పర్యటిస్తున్న తొలి పాకిస్థాన్ క్రీడా జట్టుగా ఈ రెజ్లింగ్‌ బృందం నిలవనుంది.

Last Updated : Mar 1, 2020, 4:07 PM IST

ABOUT THE AUTHOR

...view details