తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఆసియన్ బాక్సింగ్ ఛాంప్​'లో భారత్​కు పసిడి - amit panghal

ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్​షిప్​లో భారత్ పసిడి బోణీ కొట్టింది. అమిత్ పంఘల్ ఫైనల్లో కొరియా ఆటగాడిపై గెలిచి, స్వర్ణం సాధించాడు.

అమిత్ పంఘల్

By

Published : Apr 26, 2019, 1:04 PM IST

Updated : Apr 26, 2019, 1:34 PM IST

ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్​షిప్​లో భారత్​కు తొలి స్వర్ణం లభించింది. 52 కేజీల విభాగంలో అమిత్ పంఘల్ పసిడిని సాధించాడు. సెమీఫైనల్లో కొరియా బాక్సర్ కిమ్ ఇంక్యూపై విజయదుందుబి మోగించాడు. 2018 ఆసియన్ గేమ్స్​లోనూ గోల్డ్ మెడల్ సాధించాడీ బాక్సర్.

దీపక్ సింగ్ (49కేజీ), కవీందర్ సింగ్ బిష్త్ (56కేజీ) రజతాలతో సరిపెట్టుకున్నారు. ఉజ్బెకిస్థాన్​కు చెందిన నోడిర్జిన్ చేతిలో దీపక్ ఓటమి చెందగా, ఉజ్బెకిస్థాన్​కే చెందిన మిరజిజ్​బెక్ చేతిలో బిష్త్ పరాజయం పాలయ్యాడు.

Last Updated : Apr 26, 2019, 1:34 PM IST

ABOUT THE AUTHOR

...view details