తెలంగాణ

telangana

ETV Bharat / sports

బాక్సర్ అమిత్​ పంఘాల్​ పేరు అర్జునకు సిఫార్సు

ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గిన బాక్సర్ అమిత్ పంఘాల్​ పేరును అర్జున అవార్డుకు సిఫార్సు చేసింది భారత బాక్సింగ్ ఫెడరేషన్. ఇంతకుముందు 49 కేజీల విభాగంలో పోటీపడిన అమిత్.. ఈ ఏడాది నుంచి 52 కేజీల విభాగంలో సత్తాచాటుతున్నాడు.

By

Published : Apr 30, 2019, 7:55 PM IST

బాక్సింగ్

బాక్సర్ అమిత్ పంఘాల్​ పేరును రెండోసారి అర్జున అవార్డుకు సిఫార్సు చేసింది భారత బాక్సింగ్ ఫెడరేషన్. గతేడాది కూడా అమిత్ పేరును సూచించగా.. అవార్డు దక్కలేదు.

2018లో ఆసియా క్రీడల్లో బంగారు పతకాన్ని చేజిక్కుంచుకున్నాడు అమిత్. ఇండోనేషియా జకర్తాలో జరిగిన ఫైనల్​లో ఒలింపిక్ ఛాంపియన్ దస్మాతోవ్(ఉజ్బెకిస్థాన్​)ను ఓడించి పసిడి కైవసం చేసుకున్నాడు. 49 కేజీల విభాగంలో ఈ ఘనత సాధించాడు. ఈ విజయం తర్వాత గతేడాది అర్జునకు నామినేటైనా.. పురస్కారం దక్కలేదు.

2012లో డోప్ టెస్టులో విఫలమైన అమిత్.. ఏడాది పాటు నిషేధానికి గురయ్యాడు. అనంతరం చక్కటి ప్రదర్శన చేస్తున్నాడు. ఈ సంవత్సరం 52 కేజీల విభాగానికి మారి విజయాలు సొంతం చేసుకుంటున్నాడు. ఆసియా ఛాంపియన్​షిప్​లో దస్మతోవ్​ను మళ్లీ ఓడించి స్వర్ణం నెగ్గగా... బల్గేరియా స్ట్రాండ్జా టోర్నమెంట్​లోనూ పసిడి గెలిచాడు.
ఇది చదవండి:'హీనా, అంకుర్​కు ఖేల్​రత్న ఇవ్వండి'

ABOUT THE AUTHOR

...view details