భారత ఏస్ ఆర్చర్ దీపిక కుమారీ... అంతర్జాతీయ వేదికపై సత్తా చాటింది. బ్యాంకాక్ వేదికగా జరిగిన ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్.. మహిళల రికర్వ్ ఈవెంట్ విభాగంలో పసిడి సొంతం చేసుకుంది. గురువారం జరిగిన ఫైనల్లో మరో భారత క్రీడాకారిణి అంకితపై 6-0 తేడాతో గెలుపొందింది. పతకంతో పాటు ఒలింపిక్స్కు ఈ కోటాలో బెర్త్ సంపాదించుకొంది. అంకిత రజతంతో సరిపెట్టుకుంది.
ఇదే టోర్నీలో ఇటీవల రికర్వ్ మిక్స్డ్ పెయిర్ ఈవెంట్లో దీపిక, పురుష ఆర్చర్ అతన్ దాస్ కలిసి కాంస్యం గెలుచుకుంది. ఆ పోటీలో చైనాకు చెందిన యిచాయ్ జెంగ్, షోక్సన్ వే ద్వయాన్ని 6-2 తేడాతో ఓడించారు.