తెలంగాణ

telangana

By

Published : Mar 27, 2019, 2:00 PM IST

ETV Bharat / sports

భారత మహిళా హాకీ జట్టు కెప్టెన్​గా సవిత

మలేషియాతో జరిగే హాకీ సిరీస్ కోసం నూతన కెప్టెన్​గా భారత మహిళల జట్టు గోల్ కీపర్ సవిత ఎంపికైంది. ఏప్రిల్ 4న ఈ సిరీస్ ప్రారంభంకానుంది.

మహిళా హాకీ జట్టు

మలేషియాతో జరిగే హాకీ సిరీస్​కు భారత సారథిని మార్చింది హాకీ ఇండియా. కెప్టెన్ రాణి రాంపాల్ గాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకోగా గోల్​కీపర్​ సవితను సారథిగా నియమిస్తున్నట్టు ప్రకటించింది. డిఫెండర్ దీప్ గ్రేస్ ఎక్కా వైస్ కెప్టెన్​గా వ్యవహరించనుంది. రెండో గోల్ కీపర్​గా రజనీ ఎంపికైంది. ఏప్రిల్ నాలుగు నుంచి ఎనిమిది రోజుల పాటు కౌలాలంపూర్​లో 5 మ్యాచ్​ల సిరీస్ జరగనుంది.

"జట్టు సభ్యుల స్థిరత్వం కోసం ప్రయత్నిస్తున్నాం. యువ ఆటగాళ్లకు ఇదో మంచి అవకాశం. అంతర్జాతీయ స్థాయిలో వారు మంచి ప్రదర్శన చేస్తారని ఆకాంక్షిస్తున్నా" --జోర్డ్ మారినే, కోచ్

డిఫెన్స్​లో సలిమా, రీనా ఖోకర్, ఎక్కా, రష్మిత, సుశీలా చాను, సునితా లక్రాలు కీలకపాత్ర పోషించనున్నారు. గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చిన మోనికా, క్రిష్ణ యాదవ్, నిక్కీ ప్రధాన్, నేహా గోయల్, లలిమాలతో మిడ్ ఫీల్డ్ బలంగా ఉంది. ఫార్వర్డ్ లైన్​లో జ్యోతి, వందనా కఠారియా, నవజోత్ కౌర్, నవ్ నీత్ కౌర్​లు ఉన్నారు.

ఇవీ చూడండి..'డాడీస్ ఆర్మీ​' సత్తా తెలిసిందా ఇప్పుడు?

ABOUT THE AUTHOR

...view details