తెలంగాణ

telangana

ETV Bharat / sports

KTR on hockey team: 'ఘనమైన చరిత్ర రాసి.. గర్వకారణంగా నిలిచారు' - telangana news

టోక్యో ఒలింపిక్స్​ క్వార్టర్స్​లో భారత పురుషుల హాకీ జట్టు అద్భుత విజయంపై యావత్​ దేశం హర్షం వ్యక్తం చేస్తోంది. దశాబ్దాల కల నెరవేర్చారంటూ వారిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ట్విట్టర్​ వేదికగా మంత్రి కేటీఆర్​ హాకీ జట్టుకు అభినందనలు తెలియజేశారు.

KTR on hockey team
భారత పురుషుల హాకీ జట్టు

By

Published : Aug 5, 2021, 12:51 PM IST

టోక్యో ఒలింపిక్స్​లో కాంస్య పతకాన్ని సాధించిన భారత పురుషుల హాకీ జట్టుకు.. ట్విట్టర్ వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వారికి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. జర్మనీ హాకీ జట్టు పైన భారత జట్టు కాంస్య పతకం గెలుచుకోవడంపై మంత్రి కేటీఆర్​ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఘనమైన చరిత్ర రాసి.. దేశానికి గర్వకారణంగా నిలిచారంటూ ప్రశంసించారు.

నాలుగు దశాబ్దాల ఎదురుచూపు

41 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఒలింపిక్స్​లో భారత హాకీ జట్టుకు పతకం లభించింది. ఒలింపిక్స్​ కెరీర్​లోనే భారత్​కు ఇది 12వ పతకం.1980 మాస్కో ఒలింపిక్స్​లో స్వర్ణం సాధించిన ఇండియన్​ హాకీ టీమ్.. నాలుగు దశాబ్దాల తర్వాత కాంస్యం చేజిక్కించుకుంది. పసిడి పతకాన్ని తలదన్నేలా జరిగిన పోరులో హాకీ ఇండియా తన సత్తా చాటింది. నరాలు మెలిపెట్టే ఉత్కంఠను రేపుతూ పునర్వైభవమే లక్ష్యంగా అద్భుత విజయం సాధించింది. జర్మనీని 5-4 తేడాతో ఓడించి.. కాంస్యాన్ని తన ఖాతాలో వేసుకుంది. ​

హాకీలో అగ్రస్థానం

ఒలింపిక్​ హాకీ కెరీర్​లో​ ఇప్పటికే భారత్​ 12 పతకాలతో అగ్రస్థానంలో ఉంది. 8 స్వర్ణాలు, ఒక రజతం, 3 కాంస్యాలు సాధించింది. అందుకే ఇంతటి ఘన విజయంపై యావత్​ దేశం వారిని ప్రశంసల్లో ముంచెత్తుతోంది. దశాబ్దాల కల నెరవేర్చారంటూ.. మీ విజయాన్ని చూసి గర్విస్తున్నారంటూ ట్విట్టర్​ వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇదీ చదవండి:జీవో ఎలా రాశారో న్యాయ శాఖ చూడాలి కదా?: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details