తెలంగాణ

telangana

ETV Bharat / sports

నామమాత్రపు పోరులో పోలండ్​తో భారత్ ఢీ

సుల్తాన్ అజ్లాన్ షా హాకీ టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్... శుక్రవారం జరిగే నామమాత్రపు మ్యాచ్​లో పోలండ్​తో తలపడనుంది.

By

Published : Mar 28, 2019, 6:39 PM IST

భారత హాకీ జట్టు

మొదటి మ్యాచ్​లోనే ఆసియా గేమ్స్ ఛాంపియన్ జపాన్​ను ఓడించింది భారత పురుషుల హాకీ జట్టు. టోర్నీలో మొత్తం మూడు విజయాలు సాధించి, ఒక మ్యాచ్​ను​ డ్రా చేసుకుని ఫైనల్​కు దూసుకెళ్లింది. 6 దేశాలు పాల్గొంటున్న ఈ లీగ్​లో టేబుల్ టాపర్​గా ఉన్న భారత్... శుక్రవారం జరిగే నామమాత్రపు మ్యాచ్​లో పోలాండ్​తో తలపడనుంది.

పోలాండ్​(21వ ర్యాంక్)తో జరిగే మ్యాచ్​లో 5వ ర్యాంకులో ఉన్న భారత్.. ప్రధానంగా అటాకింగ్​పైనే దృష్టి పెట్టనుంది. తుదిపోరు​కు సన్నాహకంగా భావిస్తున్న ఈ మ్యాచ్​లోనూ గెలవాలని పట్టుదలగా ఉంది. అదే ఊపును ఫైనల్​లోనూ ప్రదర్శించి విజయం సాధించాలి అనుకుంటోంది.

కెనడాపై హ్యాట్రిక్ గోల్స్​తో ఫామ్​లోకి వచ్చిన మన్​దీప్ సింగ్​కు మిగిలిన ఆటగాళ్ల నుంచి మద్దతు అవసరం. వరుణ్ కుమార్ తన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.
అజ్లాన్ షా హాకీ టోర్నీ కప్పును ఐదుసార్లు సాధించిన భారత్ రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 10 టైటిళ్లతో మొదటి స్థానంలో ఉంది.

ప్రస్తుత టోర్నీ మొదటి మ్యాచ్​లో జపాన్ పై 2-0 తేడాతో గెలిచిన భారత్, మలేషియాపై 4-2, కెనడాపై 7-3 తేడాతో విజయం సాధించింది. కొరియాతో జరిగిన మ్యచ్​ను డ్రా చేసుకుంది.

ఇవీ చూడండి..ముంబయి ఇండియన్స్​ జట్టులో మరో కొత్త బౌలర్

ABOUT THE AUTHOR

...view details