తెలంగాణ

telangana

By

Published : Aug 17, 2019, 12:33 PM IST

Updated : Sep 27, 2019, 6:54 AM IST

ETV Bharat / sports

భారత మహిళా హాకీ జట్టు శుభారంభం

ఒలింపిక్ టెస్ట్ ఈవెంట్​లో భారత మహిళా హాకీ జట్టు మెరిసింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్​లో జపాన్​పై 2-1 తేడాతో విజయం సాధించింది.

హాకీ

జపాన్ వేదికగా శనివారం ప్రారంభమైన ఒలింపిక్​ టెస్ట్ ఈవెంట్​లో భారత మహిళా హాకీ జట్టు శుభారంభం చేసింది. తొలి మ్యాచ్​లో ఆతిథ్య జపాన్​పై 2-1తేడాతో విజయం సాధించింది. పురుషుల జట్టు తన మొదటి మ్యాచ్​ మలేసియాతో ఆడనుంది.

ఐదో ర్యాంకులోని భారత పురుషుల హాకీ జట్టు, 12వ ర్యాంకులోని మలేసియా.. ఈ టోర్నీలో ఫేవరేట్​గా బరిలోకి దిగాయి. న్యూజిలాండ్​(8వ ర్యాంకు)తో ఆదివారం, చివరి మ్యాచ్​లో జపాన్ (16వ ర్యాంకు)తో తలపడనుంది భారత జట్టు.

తన తర్వాతి మ్యాచ్​లో బలమైన ఆస్ట్రేలియా(2వ ర్యాంకు)ను ఢీకొట్టనుంది భారత మహిళా జట్టు. అనంతరం చైనా (11వ ర్యాంకు)తో పోరుకు సిద్ధమవుతోంది.

ఇవీ చూడండి.. నైజీరియా మాజీ ఫుట్​బాల్​ కోచ్​పై జీవితకాల నిషేధం

Last Updated : Sep 27, 2019, 6:54 AM IST

ABOUT THE AUTHOR

...view details