తెలంగాణ

telangana

By

Published : Aug 18, 2019, 1:50 PM IST

Updated : Sep 27, 2019, 9:44 AM IST

ETV Bharat / sports

మహిళా హాకీ: ఆసీస్​తో భారత్ మ్యాచ్​ డ్రా

ఒలింపిక్​ టెస్ట్ ఈవెంట్​ రెండో మ్యాచ్​లో భారత మహిళా హాకీ జట్టు ఆస్ట్రేలియాతో తలపడింది. ఈ పోరును డ్రాగా ముగించింది.

మహిళా హాకీ

జపాన్​ వేదికగా జరుగుతోన్న టోక్యో ఒలింపిక్​ టెస్ట్​ ఈవెంట్​ రెండో మ్యాచ్​లో బలమైన ఆస్ట్రేలియా (2వ ర్యాంకు)తో తలపడింది భారత్​(10వ ర్యాంకు)​. ఈ మ్యాచ్​ 2-2 తేడాతో డ్రాగా ముగిసింది.

ప్రారంభంలో దూకుడుగా ఆడింది భారత మహిళా హాకీ జట్టు. ప్రత్యర్థిని బలంగా ఎదుర్కొంది. మొదటి రౌండ్​లో రెండు జట్లకు పెనాల్టీ కార్నర్​లు లభించినా వాటిని గోల్​గా మలచలేకపోయాయి.

రెండో రౌండ్​లో ఆస్ట్రేలియా పూర్తిగా ఆధిపత్యం చెలాయించగా భారత్​ ఒత్తిడికి లోనయింది. అయితే, ఆసీస్ 1-0తో ఆధిక్యంలో ఉన్న దశలో గోల్​ కీపర్​ సవిత రెండు గోల్స్​ను ఆపింది.

36వ నిమిషంలో వందన కటారియా చేసిన గోల్​తో స్కోర్​ను సమం చేసింది భారత్​. 43వ నిమిషంలో మరో గోల్​తో ఆధిక్యంలోకి వెళ్లింది ఆస్ట్రేలియా. చివరి క్వార్టర్​లో భారత ఆటగాళ్లను కట్టడి చేసిన ఆసీస్ ఆటగాళ్లు​ గోల్​కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.

ఆటకు ఇంకా రెండు నిమిషాలు ఉందనగా పెనాల్టీ కార్నర్​ను గోల్​గా మలిచి స్కోర్​ను సమం చేసింది భారత్. మ్యాచ్​ను టైగా ముగించింది.

శనివారం జరిగిన తొలి మ్యాచ్​లో జపాన్​పై 2-1 తేడాతో గెలిచి శుభారంభం చేసింది భారత్. మూడో మ్యాచ్​లో చైనా (11వ ర్యాంకు)తో తలపడనుంది.

ఇదీ చూడండి: భారత మహిళా హాకీ జట్టు శుభారంభం

Last Updated : Sep 27, 2019, 9:44 AM IST

ABOUT THE AUTHOR

...view details