తెలంగాణ

telangana

By

Published : Apr 12, 2019, 9:00 AM IST

Updated : Apr 12, 2019, 9:30 AM IST

ETV Bharat / sports

మలేసియా టోర్నీలో చివరి పంచ్​​ భారత్​దే!

మలేసియాతో ఐదు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌లో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్​నూ సొంతం చేసుకొని 4-0తో టైటిల్​ కైవసం చేసుకుంది.

విజయంతో ముగింపు..మలేషియా హాకీ టోర్నీభారత్​ కైవసం

విదేశీగడ్డపై భారత మహిళల హాకీ జట్టు సత్తా చాటింది. ఐదు మ్యాచ్​ల మలేసియా సిరీస్​లో 4 విజయాలు, ఒక డ్రాతో టైటిల్​ గెలుచుకుంది. గురువారం జరిగిన చివరి మ్యాచ్‌లోనూ భారత్‌ 1–0తో మలేసియాపై గెలుపొందింది.

ఈ సిరీస్‌లో భారత్‌ వరుసగా తొలి నాలుగు మ్యాచ్‌ల్లో 3–0, 5–0, 4–4, 1–0 గోల్స్‌తో ఆతిథ్య జట్టు మలేసియాపై ఆధిపత్యం ప్రదర్శించింది. ఐదో మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించింది. ఫలితంగా 4–0తో సిరీస్‌ కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది.
Last Updated : Apr 12, 2019, 9:30 AM IST

ABOUT THE AUTHOR

...view details