తెలంగాణ

telangana

By

Published : May 4, 2020, 5:30 PM IST

ETV Bharat / sports

కష్టకాలంలో పేదలకు అండగా మహిళా హాకీ ప్లేయర్లు

ఫిట్​నెస్​ ఛాలెంజ్​లో పాల్గొన్న భారత మహిళా హాకీ ప్లేయర్లు.. పేదల కోసం రూ.20 లక్షలు విరాళం సేకరించారు. ఈ మొత్తాన్ని ఉదయ్ ఫౌండేషన్​కు బదిలీ చేయనున్నారు.

కరోనా బాధితులకు అండగా నిలిచిన మహిళా హాకీ ప్లేయర్లు
భారత మహిళా హకీ జట్టు

కరోనా కట్టడిలో భాగంగా భారత మహిళా హకీ క్రీడాకారిణులు, తమ వంతు సాయం అందించేందుకు ముందుకొచ్చారు. 18 రోజుల పాటు ఫిట్​నెస్​ ఛాలెంజ్​లో పాల్గొని, రూ.20,01,130లు విరాళాల రూపంలో సేకరించారు. ఈ మొత్తాన్ని దిల్లీకి చెందిన ఉదయ్ ఫౌండేషన్​ స్వచ్ఛంద సంస్థకు అందించనున్నారు. తద్వారా వారు పేదలకు సహాయపడతారు.

ఈ విషయంలో తమకొచ్చిన స్పందన చూసి భావోద్వేగానికి గురయ్యామని భారత్​ హాకీ కెప్టెన్ రాణి రాంపాల్ చెప్పింది. ఈ మంచి కార్యక్రమంలో పాల్గొని, పేదలకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి.. జట్టు సభ్యులందరి తరఫున ధన్యవాదాలు తెలిపింది.

ఈ ఛాలెంజ్​లో భాగంగా హాకీ జట్టులోని ప్రతి క్రీడాకారిణి.. మరో 10 మందికి సోషల్ మీడియా వేదికగా ఫిట్​నెస్ సవాలు విసరాలి. స్వీకరించిన ప్రతి ఒక్కరూ ఇచ్చిన టాస్క్ పూర్తి చేసి, రూ.100 విరాళమివ్వాలి. ఇప్పటికే పలువురు ప్లేయర్లు, సెలబ్రిటీలు ఇందులో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details