కరోనా దెబ్బకు భారత పురుషుల హాకీ జట్టు కుదేలైంది. ఇప్పటికే కెప్టెన్ మన్ప్రీత్ సింగ్తో పాటు మరో నలుగురు ఆటగాళ్లకు వైరస్ సోకగా.. తాజాగా ఫార్వర్డ్ క్రీడాకారుడు మన్దీప్ సింగ్కు పాజిటివ్ నిర్ధరణ అయినట్లు ప్రకటించింది భారత క్రీడా ప్రాధికార సంస్థ(సాయ్).
ఆక్సిజన్ తగ్గడంతో ఆసుపత్రిలో...
నెల రోజుల విరామం తర్వాత తిరిగి జాతీయ శిక్షణ శిబిరం కోసం బెంగళూరులోని సాయ్ కేంద్రానికి వచ్చిన హాకీ ఆటగాళ్లందరికీ వైరస్ నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 20న ఆ శిబిరం ఆరంభం కావాల్సి ఉంది. అయితే పరీక్షల్లో మన్దీప్నకు పాజిటివ్గా నిర్దరణ అయింది. తొలుత వైరస్ లక్షణాలు లేకపోవడం మిగతా అయిదుగురు ఆటగాళ్లతో పాటు అతనికీ తమ ప్రాంగణంలోనే చికిత్స అందిస్తున్నట్లు సాయ్ తెలిపింది.