తెలంగాణ

telangana

2023 పురుషుల హాకీ ప్రపంచకప్​కు ఒడిశా ఆతిథ్యం

By

Published : Nov 27, 2019, 7:25 PM IST

2023 పురుషుల హాకీ ప్రపంచకప్​కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఒడిశా ప్రభుత్వంతో కలిసి ఈ మెగాటోర్నీని నిర్వహించనుంది. 2018లో ఒడిశా వేదికగా పురుషుల హాకీ ప్రపంచకప్ జరిగింది.

Bhubaneswar, Rourkela to host 2023 Men's Hockey WC
హాకీ ప్రపంచకప్​కు ఒడిషా మరోసారి ఆతిథ్యం

ఇప్పటికే 2018లో హాకీ ప్రపంచకప్​కు ఆతిథ్యమిచ్చిన ఒడిశా.. మరోసారి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. 2023లో జరగనున్న హాకీ వరల్డ్​కప్​ను ఒడిశా ప్రభుత్వంతో సంయుక్తంగా భారత సర్కార్ నిర్వహించనుంది. భువనేశ్వర్, రూర్కేలా ఈ ప్రపంచకప్​కు వేదికలు కానున్నాయి. 2023 జనవరి 13 నుంచి 29 వరకు ఈ మెగాటోర్నీ జరగనుంది.

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బుధవారం ఈ విషయాన్ని ప్రకటించారు. భవనేశ్వర్​లోని కళింగ స్టేడియంలో నిర్వహించిన వేడుకలో తెలియజేశారు.

"మేము 2018 హాకీ ప్రపంచకప్​కు ఆతిథ్యమిచ్చాం. 2023లో ఈ మెగాటోర్నీ నిర్వహించే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది. భువనేశ్వర్, రూర్కేలా ఈ ప్రపంచకప్​ వేదికలు కానున్నాయి." - నవీన్ పట్నాయక్, ఒడిశా ముఖ్యమంత్రి.

ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్, భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు నరీందర్ బాత్రా, హాకీ ఇండియా అధ్యక్షుడు మహ్మద్ ముస్తాక్ అహ్మద్ ఒడిశా క్రీడాశాఖా మంత్రి తుషార్​కాంతి బెహ్రా హాజరయ్యారు.

2022 జులై 1 నుంచి 22 వరకు మహిళల హాకీ ప్రపంచకప్ జరగనున్నట్లు ఇటీవలే అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్(ఎఫ్ఐహెచ్​) ప్రకటించింది.

ఇదీ చదవండి: సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్​ టోర్నీ రెండో రౌండ్లో శ్రీకాంత్

ABOUT THE AUTHOR

...view details